కోలుకున్న తర్వాత…. మీడియాతో మాట్లాడిన తొలి భారత కరోనా పేషెంట్

భారత్ లో మొదటగా…. జనవరి2020లో చైనాలోని వైరస్ కు ప్రధాన కేంద్రమైన వూహాన్ సిటీ నుంచి కేరళకు వచ్చిన 20ఏళ్ల మెడికల్ స్టూడెంట్ కు కరోనా వైరస్ సోకినట్లు నిర్థాయిన అయిన విషయం తెలిసిందే. భారత్ లో ఆ యువతే మొదటి కరోనా పేషెంట్. 39రోజుల ఐసొలేషన్(ఒంటరిగా ఉండటం) తర్వాత పూర్తిగా కోలుకున్న ఆ యువతి ఇప్పుడు మరింత దృఢంగా,మానసిక ధైర్యంతో ఉంది. గత నెల 20న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఈ యువతిని 14రోజుల పాటు ఇళ్లు వదిలి రాకూడదని డాక్టర్లు చెప్పిన విషయం తెలిసిందే.
ఐసోలేషన్ వార్డులో ఉన్నప్పుడు తన అభువాలు,అసలు తనకు ఎప్పుడు కరోనా పాజిటివ్ అని తేలింది,తాను ఏ విధంగా వైరస్ తో ఫైట్ చేసింది అన్న విషయాలను మీడియాతో ఆ యువతి పంచుకున్నారు. ఇంతకాలం ఒంటరిగా ఉండటం అంత సులభం కాదని ఆ యువతి తెలిపింది. కానీ కౌన్సిలర్స్ తనను క్రమం తప్పకుండా పిలిచి,తన మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారని ఆ యువతి తెలిపింది. తనకు కరోనా పాజిటివ్ అని తేలినప్పుడు(జనవరి-30,2020)సహా ప్రయాణించిన స్నేహితులందరికీ ఫోన్ చేశానని, ఆరోగ్య అధికారులతో టచ్ లో ఉండమని వారిని అడిగినట్లు తెలిపింది. వైరస్ తో హాస్పిటల్ కు వెళ్లినప్పుడు డాక్టర్లు, అధికారులు తన దగ్గరకు వచ్చి అన్ని వివరాలు అడిగారని తెలిపింది. ఎక్కిన ఫ్లైట్,సీటు నెంబర్, సహా ప్రయాణించిన వారందరి వివరాలు అడిగారని చెప్పింది.
వూహాన్ నుంచి కేరళ ప్రయాణం
యువతి మాట్లాడుతూ….జనవరి-13,2020న నాలుగు వారాల వెకేషన్ కోసం వూహాన్ యూనివర్శిటీ మూసివేయబడింది. ఆ సమయంలో ఈ కరోనా వైరస్ ను గుర్తించలేదు. చాలా మంది రోడ్లపై తిరుగుతన్నారు. అంతా సాధారణంగానే కనిపించింది. జనవరి-17,2020 నాటికి వీధుల్లో ప్రజలు మాస్క్ లతో తిరుగుతున్నారు. వెంటనే పరిస్థితి దారుణంగా మారిపోయింది. మా సెలవులు కేవలం నాలుగు వారాలు మాత్రమే ఉన్నాయి. జూన్ లో మాకు లాంగర్ హాలిడేస్ ఉన్నాయి. విమాన టిక్కెట్లు వంటివన్నీ దృష్టిలో పెట్టుకుని జూన్ లోనే ఇంటికి(కేరళలోని త్రిసూర్) వెళ్దాం అనుకున్నాను. అయితే వూహాన్ లో పరిస్థితి మరింత దారుణంగా మారడంతో జనవరి-23న ప్రయాణం చేసేందుకు టిక్కెట్లు బుక్ చేసుకున్నాం. విమాన సేవలు అప్పటికే పరిమితం చేయబడినందున మేము కన్నింగ్ నుండి కోల్కతాకు బయలుదేరాల్సి వచ్చింది.
విమానాశ్రయాలు మూసివేయబడతాయని జనవరి 22 న మా సీనియర్ల నుండి సమాచారం వచ్చింది. కన్నింగ్కు కనెక్ట్ చేసే ఫ్లైట్ పొందడానికి మేము వెంటనే విమానాశ్రయానికి వెళ్ళాము. అయితే విమానం ఆలస్యం అని తెలియడంతో విమానంకు బదులుగా మేము రైలు ఎక్కి కన్నింగ్ కు వెళ్లాం. చైనాలో ప్రతి చోటా చెకింగ్ ను ఎదుర్కొన్నాం. యూనివర్శిటీ నుంచి బయటికి వెళ్లేటప్పుడు మా బాడీ టెంపరేచర్ చూశారు. అదే విధంగా ఎయిర్ పోర్ట్ లలో,రైల్వే స్టేషన్లలో బాడీ టెంపరేచర్ చూశారు.
కేరళకు చేరుకున్న తర్వాత
దాదాపు 20మంది విద్యార్థులం కలిసి ప్రయాణించి జనవరి-23న కేరళ చేరుకున్నాం. అక్కడి నుంచి కొంతమంది కేరళకు వెళ్లాం. భారత్ కు వచ్చిన తర్వాత దగ్గర్లోని హెల్త్ అధికారులతో టచ్ లో ఉండమని ఇండియన్ ఎంబసీ నుంచి గ్రూప్ లో నాకు ఓ మెసేజ్ వచ్చింది. జనవరి-25న నేను వచ్చినట్లు మాకు దగ్గర్లోని హెల్త్ సెంటర్ కు సమాచారమందించాను. నన్ను తనిఖీ చేస్తున్న అధికారుల నుండి నాకు రోజూ కాల్స్ వస్తున్నాయి. విషయాలు సాధారణమైనవిగా అనిపించాయి. జనవరి 27 నాటికి, నా గొంతులో దురద ఏర్పడింది. నేను వెంటనే వారికి సమాచారం ఇచ్చాను. వారు అంబులెన్స్ పంపించి నన్ను సాధారణ ఆసుపత్రిలో చేర్చారు. నా తల్లి నాతో పాటు ఉంది. హాస్పిటల్ కు తీసుకెళ్లిన అనంతరం నన్ను ఐసొలేషన్ వార్డులో ఉంచారు. నాతో పాటు కేరళకు వచ్చిన మిగిలిన నలుగురితో పాటు నా శాంపిల్స్ కూడా టెస్ట్ లకు పంపించారు. నావి తప్ప మిగిలిన వాళ్లకు కరోనా సోకలేదని తేలింది. అయితే ఆ విషయం అప్పుడు నాకు ఎవరూ చెప్పలేదు.
జనవరి-30న వచ్చిన రిపోర్ట్ లలో నాకు వైరస్ ఉన్నట్లు తేలింది. వెంటనే డాక్టర్లు,నర్సుల బృందం నా దగ్గరికి వచ్చారు. చాలా సేపు నన్ను పలు రకాల ప్రశ్నలు అడిగారు. అన్ని వైద్య సంరక్షణల తరువాత, తరువాతి పరీక్షలలో ఒకదానిలో నెగిటివ్ వచ్చినప్పుడు, దాని గురించి సమాచారం ఇవ్వలేదని ఆ యువతి చెప్పింది. వరుసగా రెండవ పరీక్ష ఫలితం తర్వాత నేను కోరోనా వైరస్ నుంచి కోలుకున్నాను. టెస్ట్ లలో నెగిటివ్ వచ్చిందని మాత్రమే నాకు సమాచారం అందింది అని ఆమె గుర్తుచేసుకుంది. ఫిబ్రవరి-20న తనను డిశ్చార్జ్ చేశారని,14రోజుల పాటు ఇంటినుంచి బయటకు రాకూడదని డాక్టర్లు చెప్పారని ఆ యువతి తెలిపింది. అధికారులు మాకు ప్రయాణం చేయవచ్చని చెప్తేనే వూహాన్ తిరిగి వెళ్తామని,తన క్లాస్ లో మొత్తం 65మంది విద్యార్థులు ఉండగా అందులో 45మంది భారతీయులేనని,ప్రస్తుతం తామందరం ఆన్ లైన్ ద్వారా క్లాస్ లకు అటెండ్ అవుతున్నట్లు ఆ యువతి తెలిపింది.
వైరస్ తో పోరాడటానికి మానసికంగా తనను తాను సిద్ధం చేసుకున్నట్లు యువతి తెలిపింది. చైనాలో వైరస్ నుండి కోలుకున్న వ్యక్తుల గురించి నేను విన్నాను. నేను శారీరకంగా బాగానే ఉన్నానని నాకు తెలుసు. కేరళ ఆరోగ్య మంత్రి కెకె శైలజా నా తల్లిని పిలిచి ఆమెతో మాట్లాడారు, ఆమెకు భరోసా ఇచ్చారని యువతి తన అనుభవాలను ఓ ఇంగ్లీష్ ఛానత్ తో పంచుకుంది.
భారత్ లో ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 28కి చేరింది. అయితే గడిచిన మూడు రోజుల్లోనే 25కేసులు నమోదవడం కీలకంగా మారింది. అయితే వైరస్ సోకినవారిలో 16మంది ఇటలీ టూరిస్టులే. కేరళలో వైరస్ సోకిన 20ఏళ్ల మెడికల్ స్టూడెంట్ సహా ముగ్గురూ కోలుకున్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన వాళ్ల సంఖ్య 90వేల 893కు చేరింది. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3వేల 110. 20కిపైగా దేశాల్లో ఇప్పుడు కరోనా వైరస్ సోకిన పేషెంట్లు ట్రీట్మెంట్ పొందుతున్నారు. ప్రస్తుతం చైనాలోనే కరోనా సోకిన 80వేలమందికి పైగా హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు.