High Court : లంచం తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగిని నిర్ధోషిగా ప్రకటించిన హైకోర్టు.. చిన్నమొత్తమే కదా అంటూ కీలక వ్యాఖ్యలు
లంచం తీసుకున్న ఓ ప్రభుత్వ ఉద్యోగిని హైకోర్టు నిర్ధోషిగా ప్రకటించింది. అంతేకాదు అతను తీసుకున్న లంచం చాలా చిన్నది అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.

bombay high court
Bombay high court : లంచం తీసుకుంటు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఓ ప్రభుత్వ ఉద్యోగిని న్యాయస్థానం నిర్ధోషిగా విడుదల చేసింది. 2007లో రూ.100 లంచం తీసుకుని గ్రామీణ ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఓ డాక్టర్ పట్టుబడ్డాడు. ఆ డాక్టర్ తీసుకున్న లంచం చాలా చిన్నది అదో పెద్ద విషయం కాదు అంటూ నిర్ధోషిగా విడుదల చేసింది ముంబై హైకోర్టు. న్యాయమూర్తి జితేంద్ర జైన్ తో కూడిన సింగిల్ బెంచ్ ధర్మాసనం తాజాగా ఈ తీర్పునిచ్చింది. రూ.100లు అనేది చాలా చిన్నది అంటూ పేర్కొంది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టు కూడా సమర్ధితి ఈ సంచలన తీర్పునిచ్చింది.
మహారాష్ట్రలోని పూణెలోని పౌడ్ గ్రామీణ ఆసుపత్రిలో అనిల్ షిండే అనే డాక్టరు విధులు నిర్వహించేవారు.ఈక్రమంలో ఆయన డ్యూటీలో ఉండగా 2007లో ఓ వ్యక్తి గాయాలతో వచ్చాడు. తనకు తనపై కొంతమంది దాడి చేశారని తనకు గాయాలు అయినట్లుగా సర్టిఫికెట్ ఇవ్వాలని కోరాడు. దానికి డాక్టర్ అనిల్..రూ.100లు ఇస్తే సర్టిఫికెట్ ఇస్తానని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశాడు. ఈక్రమంలో అతను డబ్బు ఇస్తుండగా పక్కా ప్లాన్ ప్రకారంగా అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా బుక్ అయ్యాడు.
డాక్టర్ అనిల్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ప్రత్యేక న్యాయస్థానానికి సమర్పించారు అధికారులు. దీనిపై విచారణ చేసిన న్యాయస్థానం 2012 జనవరిలో న్యాయస్థానం డాక్టర్ ను నిర్ధోషిగా ప్రకటించిది. దీంతో అధికారులు హైకోర్టులో సవాల్ చేశారు అధికారులు. హైకోర్టు కూడా స్పెషల్ కోర్టు తీర్పును సమర్ధిస్తు డాక్టర్ అనిల్ ను నిర్ధోషిగా ప్రకటించింది.
ఈ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానిస్తు 2007లో రూ.100 లంచం తీసుకోవడం చాలా చిన్న విషయమని..అవినీతి నిరోధక చట్టంలోని కొన్ని నిబంధనల ప్రకారం నిందితుడిని నిర్దోషిగా పరిగణిస్తున్నామని తీర్పు వెలువరించింది.