Neeraj Chopra : పెళ్లైన సంవత్సరానికి రిసెప్షన్.. పీఎం మోదీసహా ప్రముఖులు హాజరు.. ఫొటోలు వైరల్
Neeraj Chopra : భారత దిగ్గజ జావెలిన్ త్రోయర్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా 2025 జనవరిలో హిమాని మోర్ను వివాహం చేసుకున్నాడు. అయితే, 2025 డిసెంబర్ 26వ తేదీన న్యూఢిల్లీలో వివాహ రిసెప్షన్ను నిర్వహించారు. ఈ రిసెప్షన్ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని నీరజ్, హిమాని జంటను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నీరజ్ చోప్రా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశాడు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.









