రాజధాని తరలిస్తే దేశం విడిచి వెళ్లటం బెటర్ : సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు

  • Published By: chvmurthy ,Published On : January 11, 2020 / 10:03 AM IST
రాజధాని తరలిస్తే దేశం విడిచి వెళ్లటం బెటర్ : సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు

Updated On : January 11, 2020 / 10:03 AM IST

ఏపీ  రాజధాని తరలింపు అంశంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.  రాజధానిని తరలిస్తే  ఊరుకోబోమని….అమరావతిని తరిలిస్తే భారత పౌరుడిగా ఉండటం కంటే  శరణార్ధిగా మరో దేశమే  వెళ్లటం మేలని  ఆయన వ్యాఖ్యానించారు.  అమరావతి తరలింపు అంత ఈజీ కాదని అన్ని వర్గాల ప్రజలు తమతో కలిసి రావాలని  ఆయన పిలుపునిచ్చారు.  

కేంద్ర  ప్రభుత్వంతో మాట్లాడి రాజధాని తరలింపు ప్రతిపాదనను వెనక్కు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు వస్తామని సుజనా చౌదరి చెప్పారు.  రాజధాని తరలిస్తే అసలు ఇక్కడ పౌరుడిగా ఉండటమే దండగని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా చూస్తూ ఊరుకుంటే నేరాలు, ఘోరాలు పెరిగిపోతాయని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఏదో జరిగిపోతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా తనకు మద్దతుగా నిలవాలని కోరారు.