Delhi Services Act: ఢిల్లీ బిల్లు కథ ముగించిన మోదీ సర్కారు.. రాష్ట్రపతి ఆమోదముద్రతో అమల్లోకి చట్టం
ఢిల్లీలో అధికారుల బదిలీ-పోస్టింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేజ్రీవాల్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది. అటువంటి పరిస్థితిలో, చట్టాన్ని సవరించడం లేదా కొత్త చట్టం చేయడం మాత్రమే కేంద్ర ప్రభుత్వం ముందు ఉన్న ఏకైక మార్గం.

Delhi Services Bill: కొద్ది రోజులు ఢిల్లీ సర్వీసులకు సంబంధించిన బిల్లుపై అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు విపక్ష పార్టీల మధ్య చాలా రగడ కొనసాగింది. మొదట ఆ బిల్లుపై ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలిపింది. అనంతరం, విపక్షాలన్నీ ఆప్కు గొంతుకను ఇచ్చాయి. చివరికి కాంగ్రెస్ పార్టీ కూడా విపక్షాలతో గొంతు కలపడంతో ఆ బిల్లు చర్చనీయాంశమైంది. అయితే విపక్షాలను దాటుకుని ఆ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసింది కేంద్ర ప్రభుత్వం. అనంతరం శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో ఆ బిల్లు చట్టంగా మారింది.
International Lefthanders Day: ఎడమ చేతితో ప్రపంచం అబ్బురపడే విజయాలు సాధించింది వీరే..
భారత ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం జారీ చేసిన నోటిఫికేషన్లో గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) చట్టం 2023ని అమలు గురించి ప్రతిపాదించారు. అనంతరం ఆగస్టు 7న పార్లమెంట్ లభించింది. ‘ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ గవర్నెన్స్ సవరణ బిల్లు 2023’కి రాజ్యసభలో 131 ఓట్లు అనుకూలంగా రాగా, వ్యతిరేకంగా వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చాయి. అంతకు ముందు ఆగస్టు 3న లోక్సభలో ఆమోదించింది.
Telangana Congress: ముఖ్యమంత్రి కేసీఆర్పైనే ఈ ప్రయోగం ఎందుకు.. సూర్యం అంగీకరిస్తారా?
వాస్తవానికి, ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం, మే 11న తన తీర్పును వెలువరిస్తూ, ఢిల్లీలో భూమి, పోలీసు-శాంతిభద్రతలు మినహా మిగిలిన అన్ని పరిపాలనా నిర్ణయాలను తీసుకునే స్వేచ్ఛ ఢిల్లీ ప్రభుత్వానికి ఉంటుందని పేర్కొంది. అధికారులు, ఉద్యోగుల బదిలీ-పోస్టింగ్ కూడా చేయొచ్చని పేర్కొంది. ఈ మూడు అంశాలు మినహా ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాలను లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయానికి ముందు, ఢిల్లీ ప్రభుత్వంలోని అధికారులందరి బదిలీలు, పోస్టింగ్లు లెఫ్టినెంట్ గవర్నర్ ఎగ్జిక్యూటివ్ నియంత్రణలో ఉండేవి.
Bonda Uma : వైసీపీ 175కి 175 సీట్లు గెలిస్తే మాపార్టీని మూసేస్తాం : బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు
అయితే కోర్టు తీర్పు వెలువడిన వారం రోజుల తర్వాత మే 19న కేంద్ర ప్రభుత్వం దీని మీద ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ ఆర్డినెన్స్, 2023’ని తీసుకురావడం ద్వారా కేంద్రం లెఫ్టినెంట్ గవర్నర్కు అడ్మినిస్ట్రేటివ్ అధికారుల నియామకం, బదిలీ హక్కును తిరిగి ఇచ్చింది. ఈ ఆర్డినెన్స్ కింద నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీని ఏర్పాటు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఢిల్లీ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శిని ఇందులో సభ్యులుగా చేశారు. ఈ అథారిటీకి ముఖ్యమంత్రి చైర్మన్గా ఉంటారు. మెజారిటీ ఆధారంగా ఈ అథారిటీ నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే, అథారిటీ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడితే, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయమే అంతిమంగా ఉంటుంది.
ఢిల్లీలో అధికారుల బదిలీ-పోస్టింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేజ్రీవాల్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది. అటువంటి పరిస్థితిలో, చట్టాన్ని సవరించడం లేదా కొత్త చట్టం చేయడం మాత్రమే కేంద్ర ప్రభుత్వం ముందు ఉన్న ఏకైక మార్గం. ఆ సమయంలో పార్లమెంట్ పనిచేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ చట్టాన్ని రద్దు చేసింది. ఆరు నెలల్లోగా పార్లమెంటు ఉభయ సభల్లో ఏదైనా ఆర్డినెన్స్ను ఆమోదించాలి. అందుకే ప్రభుత్వం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఉభయ సభల్లో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు 2023ని తీసుకొచ్చి ఆమోదింప చేసుకుంది.