చెక్ చేసుకోండి : మహిళల ఖాతాల్లోకి రూ.3,500 వేసిన చంద్రబాబు

  • Published By: veegamteam ,Published On : March 7, 2019 / 07:39 AM IST
చెక్ చేసుకోండి : మహిళల ఖాతాల్లోకి రూ.3,500 వేసిన చంద్రబాబు

Updated On : March 7, 2019 / 7:39 AM IST

ఏపీలోని మహిళలకు ఈ రోజు (మార్చి-7-2019) శుభ దినం అని సీఎం చంద్రబాబు అన్నారు.  పసుపు-కుంకుమ పథకం రెండో విడత సొమ్మును మహిళల ఖాతాలో జమచేశామన్నారు. ఒక్కో మహిళ ఖాతాలో రూ.3,500 డిపాజిట్ చేశామన్నారు. పసుపు-కుంకుమ పథకం కింద మరో విడతలో రూ.4వేల నగదును మరోసారి అందజేస్తామన్నారు. అమరావతిలో టీడీపీ నేతలు, బూత్ స్థాయి కన్వీనర్లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడారు.
Also Read : పవర్ & పాలిటిక్స్ : ఏపీలో కాక పుట్టిస్తున్న రాజకీయాలు

రేపు(మార్చి-7-2019) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరి ఖాతాల్లోకి నగదు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం చెప్పారు. వినూత్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లో భరోసా కల్పిస్తున్నామన్నారు. రేపు ఏపీ అంతటా డ్వాక్రా మహిళలు ర్యాలీలు నిర్వహించబోతున్నారని వెల్లడించారు.

టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్ ఓర్వలేకపోతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో ఓట్ల తొలగింపు వెనుక వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రానికి వ్యతిరేకంగా ఈ 3 పార్టీలు కుట్రలు చేస్తున్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకునేందకు టీఆర్ఎస్ నేతలు మనతో గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. మోడీ, కేసీఆర్ అండతో జగన్ చెలరేగిపోతున్నారని ఫైర్ అయ్యారు.
Also Read : కారణం ఇదేనా?: టీడీపీ వెబ్ సైట్ కు ఏమైంది?