Rahul Gandhi: ఒక వైపు గాంధీ, మరొక వైపు గాడ్సే.. కాంగ్రెస్-బీజేపీ ఫైట్‭పై రాహుల్ గాంధీ పోలిక

భారత్ జోడో యాత్ర సందర్భంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాహుల్ తన పాదయాత్ర గురించి గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో 370 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, ఆ ప్రయాణంలో ఎంతో మంది రైతులు, మహిళలు, యువతను కలిశానని అన్నారు.

Rahul Gandhi: ఒక వైపు గాంధీ, మరొక వైపు గాడ్సే.. కాంగ్రెస్-బీజేపీ ఫైట్‭పై రాహుల్ గాంధీ పోలిక

Updated On : September 30, 2023 / 6:44 PM IST

Gandhi vs Godse: భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరాటాన్ని భావజాలపరమైన పోరాటంగా అభివర్ణించారు కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ. ఈ భావజాల పోరాటానికి ఆయన ఒక పోలికను కూడా వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీని గాంధేయవాదంతో పోల్చిన ఆయన.. బీజేపీని గాడ్సేవాదంతో పోల్చారు. ఇది గాంధీ-గాడ్సేకు మధ్య జరుగుతున్న పోరాటమంటూ చెప్పారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని షాజాపూర్ లో శనివారం నిర్వహించిన ‘జన్ ఆక్రోశ్’ ర్యాలీకి రాహుల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

‘‘ఈ పోరాటం రెండు భావజాలాల మధ్య జరుగుతోంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భావజాలం ఉంది. మరొకవైపు బీజేపీ-ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది. ఒకవైపు మహాత్మ గాంధీ ఉన్నారు. మరొకవైపు గాడ్సే ఉన్నారు’’ అని రాహుల్ గాంధీ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘వాళ్లు (బీజేపీ-ఆర్ఎస్ఎస్) ఎక్కడికి వెళ్లినా విధ్వేషాన్నే ప్రచారం చేస్తారు. మధ్యప్రదేశ్ లో కూడా ఇదే జరుగుతోంది. కానీ ప్రజలకు వారు ఏమిచ్చారో అది తిరిగిపొందుతున్నారు. ప్రజలు విధ్వేషాన్ని సాగనంపుతారు. బీజేపీది విధ్వేషం, కాంగ్రెస్ ది ప్రేమ’’ అని అన్నారు.

Zealandia: 8వ ఖండాన్ని కనుక్కొన్న శాస్త్రవేత్తలు.. కళ్ల ముందే ఉన్నా 375 ఏళ్లకు కానీ గుర్తించలేకపోయాం

భారత్ జోడో యాత్ర సందర్భంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాహుల్ తన పాదయాత్ర గురించి గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో 370 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, ఆ ప్రయాణంలో ఎంతో మంది రైతులు, మహిళలు, యువతను కలిశానని అన్నారు. వాళ్లు తనకు కొన్ని సమస్యలు వివరించారని, అందులో రాష్ట్రంలో పెరిగిపోతున్న అవినీతి అత్యంత ముఖ్యమైందని రాహుల్ అన్నారు. పక్క రాష్ట్రం ఛత్తీస్‭గఢ్‭లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతున్నాయని, మధ్యప్రదేశ్ లో కూడా డిసెంబర్ తర్వాత అదే జరుగుతుందని గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.