TTD : టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం.. జమ్మూ ఆలయానికి రూ.17.40 కోట్లు
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి గురువారం సమావేశమైంది. ఈ సమావేశంలో జమ్మూలో శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి రూ.17.40 కోట్లతో టెండర్లకు ఆమోదముద్ర వేసింది.

Ttd (2)
TTD : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి గురువారం సమావేశమైంది. ఈ సమావేశంలో జమ్మూలో శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి రూ.17.40 కోట్లతో టెండర్లకు ఆమోదముద్ర వేసింది. చెన్నై, బెంగళూరు, ముంబైలో టీటీడీ సమాచార కేంద్రాలు, శ్రీవారి ఆలయాల స్థానిక సలహా మండళ్లకు ఛైర్మన్ల నియామకానికి ఆమోదం తెలిపింది. చెన్నై కేంద్రానికి ఏజే శేఖర్ రెడ్డి, బెంగళూరు కేంద్రానికి రమేష్ శెట్టి, ముంబై కేంద్రానికి అమోల్ కాలేను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
Read More : Dr. Jupalli Rameshwar rao: టీటీడీ బోర్డ్ సభ్యుడిగా డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు ప్రమాణ స్వీకారం
ఇక కడప రాయచోటిలో టీటీడీ కల్యాణమంటపం నిర్మాణానికి రూ.2.21 కోట్లతో టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలిపిరి కాలిబాట సుందరీకరణ పనులకు రూ.7.50 కోట్లతో టెండర్లకు ఆమోదం తెలిపింది పాలకమండలి. మరోవైపు, టీటీడీ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించేందుకు ఆప్కాస్ తరహాలో టీటీడీ కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
తిరుమలలోని వరాహ స్వామి విశ్రాంతి భవనం 2లో అభివృద్ధి పనులు, మరమ్మతులు కొరకు రూ.2.61 కోట్లు కేటాయించారు. టీటీడీ ఉద్యోగుల హెల్త్ ఫండ్కు ఆమోదం లభించగా స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోని సెంటర్ ఫర్ అడ్వాన్స్ రీసెర్చి భవనంలో అదనంగా 4, 5 అంతస్తుల నిర్మాణానికి కూడా రూ.4.46 కోట్లతో టెండర్లకు ఆమోదం తెలిపింది టీటీడీ పాలకమండలి.
Read More : TTD : ఈ నెల 7 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 11న తిరుమలకు సీఎం జగన్
ఇక ప్రతి ఏటా శరన్నవరాత్రుల సందర్భంగా తిరుమలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభం అయ్యాయి. ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం చేశారు. స్వజారోహణ కార్యక్రమం వైభవంగా జరిగింది. దీనిలో భాగంగా వైదిక కార్యక్రమాలు నిర్వహించారు అర్చకులు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అర్చకులు ధ్వజపటం ఎగురవేసి ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. గురువారం రాత్రి పెద్దశేష వాహన సేవ ఉండనుంది.