IPL 2024: క్రికెట్ పిచ్చికి నిద‌ర్శ‌నం.. దిండు, దుప్ప‌టితో దిగేశారుగా..

మ్యాచ్ టికెట్ల‌ను ఎలాగైనా సాధించాల‌ని ఫ్యాన్స్ ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు.

IPL 2024: క్రికెట్ పిచ్చికి నిద‌ర్శ‌నం.. దిండు, దుప్ప‌టితో దిగేశారుగా..

Craze for RR vs RCB Match tickets fans sleeping near ticket counters

ఐపీఎల్‌లో మ్యాచ్‌లు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి. శుక్ర‌వారం రాత్రి ఉప్ప‌ల్ స్టేడియంలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇక ఐపీఎల్ 2024 షెడ్యూల్‌లో భాగంగా శ‌నివారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది. వ‌రుస‌గా మూడు మ్యాచుల్లో గెలిచి మంచి జోష్‌లో ఉన్న ఆర్ఆర్ అదే విజ‌య‌యాత్ర‌ను కంటిన్యూ చేయాల‌ని భావిస్తోంది.

ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు మ్యాచుల్లో ఓడిపోయి కేవ‌లం ఒకే మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల ప‌ట్టిక‌లో ఎనిమిదో స్థానంలో కొన‌సాగుతోంది ఆర్‌సీబీ. ఆర్ఆర్ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం బెంగ‌ళూరుకు ఎంతో ముఖ్యం. ఈ క్ర‌మంలో మ్యాచ్ హోరాహోరీగా జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ మ్యాచ్ టికెట్ల కోసం మంచి డిమాండ్ ఉంది. త‌మ అభిమాన ఆట‌గాళ్ల‌ను ప్ర‌త్య‌క్షంగా చూసేందుకు అభిమానులు త‌హ‌త‌హ‌లాడుతున్నారు.

Rohit Sharma : మెగావేలంలోకి రానున్న రోహిత్ శ‌ర్మ‌? ముంబైని వీడ‌నున్నాడా?

ముఖ్యంగా ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లిని చూసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఈ క్ర‌మంలో మ్యాచ్ టికెట్ల‌ను ఎలాగైనా సాధించాల‌ని ఫ్యాన్స్ ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు. మ్యాచ్‌కు రెండు రోజుల ముందు నుంచే టికెట్ల కోసం క్యూ క‌డుతున్నారు. గురువారం రాత్రి స‌వాయ్ మాన్‌సింగ్ స్టేడియం వ‌ద్ద‌కు ప‌లువురు అభిమానులు చేరుకున్నారు.

దుప్ప‌టి, దిండు ప‌ట్టుకుని మ‌రీ వ‌చ్చారు. ఉద‌యం క్యూ లైన్ ఎక్కువ‌గా ఉంటుంద‌ని భావించి వారు ఇలా వ‌చ్చారు. స్టేడియంలో కౌంట‌ర్ల వ‌ద్దే నిద్రించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఐపీఎల్ క్రేజ్‌కు ఇది అద్దం ప‌డుతుంద‌ని ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Rishabh Pant : కోల్‌క‌తాపై ఘోర ఓట‌మి.. పంత్‌కు రూ.24 ల‌క్ష‌ల జ‌రిమానా..