Cricketer Shikhar Dhawan : క్రికెటర్ శిఖర్ ధావన్‌- అయేషాకు విడాకులు మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు

భారత క్రికెటర్ శిఖర్ ధావన్‌ దంపతుల విడాకుల కేసులో ఢిల్లీ కోర్టు తాజాగా కీలక తీర్పు ఇచ్చింది. భార్య క్రూరత్వం కారణంగా క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఢిల్లీ కోర్టు విడాకులు మంజూరు చేసింది....

Cricketer Shikhar Dhawan : క్రికెటర్ శిఖర్ ధావన్‌- అయేషాకు విడాకులు మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు

Cricketer Shikhar Dhawan

Updated On : October 5, 2023 / 12:47 PM IST

Cricketer Shikhar Dhawan : భారత క్రికెటర్ శిఖర్ ధావన్‌ దంపతుల విడాకుల కేసులో ఢిల్లీ కోర్టు తాజాగా కీలక తీర్పు ఇచ్చింది. భార్య క్రూరత్వం కారణంగా క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఢిల్లీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. విడిపోయిన శిఖర్ ధావన్, అతని భార్య ఆయేషా ముఖర్జీలకు ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. భార్య అయేషా క్రూరత్వం కారణంగా విడాకుల డిక్రీకి శిఖర్ ధావన్ అర్హుడని కోర్టు పేర్కొంది. వారి 11 ఏళ్ల వివాహాన్ని రద్దు చేస్తూ హరీష్ కుమార్ కుటుంబ న్యాయస్థానం తుది తీర్పు ఇచ్చింది.

Also read : Kerala high court : నాకు బిడ్డను కనాలని ఉందని జీవిత ఖైదీ భార్య వినతి…కేరళ హైకోర్టు సంచలన ఉత్తర్వులు

‘‘పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవడానికి ఇరువర్గాలు అంగీకరించారని, వారి వివాహం చాలా కాలం క్రితం బ్రేకప్ అయిందని, ఆగస్టు నుంచి వారు భార్యాభర్తలుగా జీవించడం లేదని కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తి హరీష్ కుమార్ పేర్కొన్నారు. పిటిషనర్‌ ధావన్ పట్ల మాజీ భార్య క్రూరంగా ప్రవర్తించినట్లు కోర్టు నిర్ధారించింది.

Also read : Earthquake : భవిష్యత్‌లో భారీ భూకంపాల ముప్పు…ఐఐటీ భూకంప నిపుణుడి హెచ్చరిక