IND vs ENG : టీమ్ఇండియాను సవాల్ చేసిన ఇంగ్లాండ్..! ఒక్క రోజు ముందుగానే.. అంత నమ్మకం ఏంటో మరీ..!
మ్యాచ్కు ఒక రోజు ముందే ఇంగ్లాండ్ జట్టు తమ తుది జట్టును ప్రకటించింది.
India vs England : దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ ను 1-1తో సమం చేసి ఆపై అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్ను 3-0 క్లీన్ స్వీప్ చేసిన టీమ్ఇండియా రెట్టించిన ఉత్సాహంతో ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు సిద్దమవుతోంది. ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ మైదానంలో గురువారం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మొదటి టెస్టు మ్యాచ్ జరగనుంది. అయితే.. మ్యాచ్కు ఒక రోజు ముందే ఇంగ్లాండ్ తమ తుది జట్టును ప్రకటించింది.
ఉప్పల్ పిచ్ స్పిన్కు అనుకూలిస్తుందని ఇంగ్లాండ్ అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా ముగ్గురు స్పిన్నర్లకు చోటు ఇచ్చింది. ఈ క్రమంలో వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ను బెంచీకే పరిమితం చేసింది. కేవలం ఒక్క స్పెషలిస్టు పేసర్తో బరిలోకి దిగుతుండడం గమనార్హం. కాగా.. 1962 తరువాత ఒక్క పేసర్తోనే ఇంగ్లాండ్ జట్టు బరిలోకి దిగడం ఇదే తొలిసారి.
తుది జట్టులో జాక్ లీచ్, రిహాన్ అహ్మద్, టామ్ హర్ట్లీ లు ముగ్గురు స్పిన్నర్లు. వీరిలో జాక్ లీచ్ ఒక్కడికే గతంలో భారత్లో ఆడిన అనుభవం ఉంది. టామ్ హార్ట్లీ టీమ్ఇండియాతో మ్యాచ్తోనే అరంగ్రేటం చేయనున్నాడు. స్పెషలిస్ట్ పేసర్గా మార్క్ వుడ్ ఒక్కడే ఉన్నాడు. క్రాలే, డకెట్, పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్స్టోక్స్లతో కూడిన బ్యాటింగ్ విభాగం చాలా పటిష్టంగా కనిపిస్తోంది.
మొదటి టెస్టుకు ఇంగ్లాండ్ తుది జట్టు ఇదే..
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, మార్క్ వుడ్.
ఇంగ్లాండ్ తమ తుది జట్టును ఒక రోజు ముందుగానే ప్రకటించడం చూస్తుంటే భారత పర్యటనకు ఎంతో సన్నద్దం అయి ఇక్కడకు వచ్చినట్లు అర్థం అవుతుంది.
IND vs ENG : క్రికెట్ అభిమానులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త.. ఉప్పల్లో మ్యాచ్ చూడాలనుకునే వారికే..
We’ve named our XI for the first Test in Hyderabad! 🏏
🇮🇳 #INDvENG 🏴 | #EnglandCricket
— England Cricket (@englandcricket) January 24, 2024