India vs Pakistan: అసలు సిసలైన మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.

India vs Pakistan
India vs Pakistan: ఆసియా కప్ 2025లో భాగంగా ఇవాళ 6వ మ్యాచ్ జరుగుతోంది. భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ తీసుకుంది. (India vs Pakistan)
భారత జట్టు: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చకరవర్తి
పాకిస్థాన్ జట్టు: సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, మహ్మద్ హారీస్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్
కాగా.. భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఆ సందడే వేరు. భారత్ గెలవాలంటూ క్రికెట్ అభిమానులు వినూత్నంగా అభిమానం చాటుకుంటున్నారు. ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి, ప్రయాగ్రాజ్లో ప్రత్యేక పూజలు, హోమాలు, జల హారతి వంటి కార్యక్రమాలను నిర్వహించారు.