బెంగళూరు బాదుడు : కోల్కతా టార్గెట్ 206

ఐపీఎల్ 2019 సీజన్ 12లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెచ్చిపోయింది. ఎట్టకేలకు బెంగళూరు బ్యాట్స్ మెన్ ఫామ్ లోకి వచ్చారు. తొలుత బ్యాటింగ్ చేసిన విరాట్ సేన 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. మూడు వికెట్లు మాత్రమే కోల్పోయింది. బెంగళూరు బ్యాట్స్ మెన్ లో కెప్టెన్ విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ చెలరేగిపోయారు. విరాట్ కోహ్లి 49 బంతుల్లో 84 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, 9 సిక్స్ లు ఉన్నాయి. డివిలియర్స్ 32 బంతుల్లో 63 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 4 సిక్స్ లు, 5 ఫోర్లు ఉన్నాయి. వీరిద్దరూ కోల్కతా బౌలింగ్ను ఊచకోత కోశారు. భారీ షాట్లతో విరుచుకుపడ్డారు.
టాస్ గెల్చిన కోల్ కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. సీజన్ ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఖాతా తెరవనేలేదు. ఇతర ఐపీఎల్ జట్లు విజయాలతో ముందుకు దూసుకెళ్తున్నాయి. కోహ్లీసేన మాత్రం పరాజయాలతో వెనుకబడిపోయింది. గెలుపు గుర్రాలుగా పిలిచే బెంగళూరు జట్టు ఆటగాళ్లంతా ఒక్కసారిగా డల్ మారిపోయారు. బౌండరీలు, సిక్సర్లతో చెలరేగే ఆటగాళ్ల సత్తా చాటలేక చతికలపడ్డారు. ఊహించని రీతిలో పేలవ ప్రదర్శనతో విమర్శల పాలవుతోంది. స్టార్ ప్లేయర్స్ ఉన్నా బెంగళూరును ఓటమి వెంటాడుతోంది. ఈ సీజన్ లో ఇప్పటివరకూ బెంగళూరు 4 మ్యాచ్ లు ఆడితే నాలుగు మ్యాచుల్లోనూ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.