Virat Kohli : శ్రీలంకతో వన్డే సిరీస్.. సచిన్ ఆల్టైమ్ రికార్డు పై కోహ్లీ కన్ను..
విరాట్ కోహ్లీ లంకతో వన్డే సిరీస్లో ఓ అరుదైన రికార్డు పై కన్నేశాడు.
![Virat Kohli : శ్రీలంకతో వన్డే సిరీస్.. సచిన్ ఆల్టైమ్ రికార్డు పై కోహ్లీ కన్ను.. Virat Kohli : శ్రీలంకతో వన్డే సిరీస్.. సచిన్ ఆల్టైమ్ రికార్డు పై కోహ్లీ కన్ను..](https://10tv.in/wp-content/uploads/2024/08/Virat-Kohli-Needs-152-Runs-In-ODI-Series-vs-Sri-Lanka-to-break-sachin-18-year-old-odi-record.jpg)
Virat Kohli Needs 152 Runs In ODI Series vs Sri Lanka to break sachin 18 year old odi record
Virat Kohli Needs 152 Runs : శ్రీలంకతో టీ20 సిరీస్ను 3-0తో క్వీన్ స్వీప్ చేసిన భారత జట్టు అదే ఉత్సాహంతో వన్డే సిరీస్ కు సిద్దమైంది. కొలంబో వేదికగా నేడు భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగనున్న నేపథ్యంలో లంకతో వన్డే సిరీస్ను సద్వినియోగం చేసుకుని జట్టు కూర్పు పై ఓ అంచనాకు రావాలని టీమ్ఇండియా భావిస్తోంది. టీ20 ప్రపంచకప్ అనంతరం విశ్రాంతి తీసుకున్న టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వన్డే సిరీస్తోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు.
వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ అనంతరం రోహిత్, కోహ్లీ ఆడుతున్న తొలి వన్డే ఇదే కావడం గమనార్హం. కాగా.. పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ లంకతో వన్డే సిరీస్లో ఓ అరుదైన రికార్డు పై కన్నేశాడు. కోహ్లీ మరో 152 పరుగులు చేస్తే వన్డేల్లో 14 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. వన్డేల్లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా రికార్డులకు ఎక్కనున్నాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేసిన రికార్డు ప్రస్తుతం టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 350 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. కోహ్లీ ప్రస్తుతం 280 ఇన్నింగ్స్ల్లో 13,848 పరుగులతో ఉన్నాడు.
వన్డేల్లో ఇప్పటి వరకు 14వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్లు ఇద్దరే ఉన్నారు. వారిలో ఒకరు సచిన్ టెండూల్కర్ కాగా మరొకరు శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కర. 14వేల పరుగుల మైలురాయిని 378 ఇన్నింగ్స్ల్లో సంగక్కర చేరుకున్నాడు.
వన్లేల్లో 14 వేల పరుగులు చేసిన ఆటగాళ్లు..
సచిన్ టెండూల్కర్ (భారత్) – 350 ఇన్నింగ్స్ల్లో
కుమార సంగక్కర (శ్రీలంక) – 378 ఇన్నింగ్స్ల్లో
Nikhat Zareen : పారిస్ ఒలింపిక్స్లో ఓటమి.. తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కీలక వ్యాఖ్యలు..
వన్డేల్లో అత్యధిక శతకాల రికార్డు..
వన్డేల్లో అత్యధిక శతకాల రికార్డు కోహ్లీ పేరిటే ఉన్న సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచకప్ 2023లో సచిన్ రికార్డును బ్రేక్ చేస్తూ కోహ్లీ దీన్ని అందుకున్నాడు. కోహ్లీ 280 ఇన్నింగ్స్ల్లో 58 సగటుతో 13,848 పరుగులు చేశాడు. ఇందులో 72 అర్థశతకాలు, 50 సెంచరీలు ఉన్నాయి. సచిన్ తన వన్డే కెరీర్లో 452 ఇన్నింగ్స్ల్లో 44 సగటుతో 18,426 పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.