ICC Awards: క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు ప్రకటించిన ఐసీసీ!

పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్, ఇంగ్లండ్‌కు చెందిన టామీ బ్యూమాంట్‌లకు 2021కి గాను ఉత్తమ టీ20 క్రికెటర్ అవార్డులను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్.

ICC Awards: క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు ప్రకటించిన ఐసీసీ!

Cricketer

Updated On : January 23, 2022 / 7:23 PM IST

ICC Awards: పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్, ఇంగ్లండ్‌కు చెందిన టామీ బ్యూమాంట్‌లకు 2021కి గాను ఉత్తమ టీ20 క్రికెటర్ అవార్డులను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC). ఉత్తమ పురుషుల విభాగంలో రిజ్వాన్‌కు, మహిళల T20 విభాగంలో టామీ బ్యూమాంట్‌లను బెస్ట్ క్రికెటర్‌లుగా ఎంపిక చేసింది ఐసీసీ. దీంతో పాటు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు దక్షిణాఫ్రికా ఓపెనర్ జానెమన్ మలన్‌ను ఎంపికచేశారు.

ఒమన్ కెప్టెన్ జీషన్ మక్సూద్, ఆస్ట్రియాకు చెందిన ఆండ్రియా-మే జెపెడా వరుసగా పురుషులు మరియు మహిళలకు ICC అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2021గా ఎంపికయ్యారు. పురుషుల, మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శనకారులకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నామినేట్ చేసిన మొదటి వ్యక్తిగత అవార్డుల సెట్ ఇదే.

Suresh Raina: పుష్ప క్రేజ్.. తగ్గేదే లే.. క్రికెటర్ సురేష్ రైనా స్టెప్పులు

పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 2021లో టీ20 ఇంటర్నేషనల్స్‌లో అద్భుత ప్రదర్శన చేయగా, మహిళల టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఆ సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో బ్యూమాంట్ మూడో స్థానంలో నిలిచారు. రిజ్వాన్ గతేడాది కేవలం 29 మ్యాచ్‌ల్లో 73.66 సగటుతో 134.89 స్ట్రైక్ రేట్‌తో 1,326 పరుగులు చేశాడు.

బ్యాటింగ్‌లోనే కాదు.. కీపర్‌గానూ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. T20 ప్రపంచ కప్ 2021లో సెమీ-ఫైనల్‌కు పాకిస్తాన్ చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. రిజ్వాన్ టోర్నమెంట్‌లో మూడవ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.