IPL 2020 : రూ.10.75 కోట్లకు మ్యాక్స్ వెల్ ను దక్కించుకున్న పంజాబ్
ఐపీఎల్ 2020 సీజన్కి సంబంధించి ఆటగాళ్ల వేలం కోల్కతా వేదికగా గురువారం(డిసెంబర్ 19,2019) మధ్యాహ్నం ప్రారంభమైంది. ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్ భారీ ధర పలికాడు.

ఐపీఎల్ 2020 సీజన్కి సంబంధించి ఆటగాళ్ల వేలం కోల్కతా వేదికగా గురువారం(డిసెంబర్ 19,2019) మధ్యాహ్నం ప్రారంభమైంది. ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్ భారీ ధర పలికాడు.
ఐపీఎల్ 2020 సీజన్కి సంబంధించి ఆటగాళ్ల వేలం కోల్కతా వేదికగా గురువారం(డిసెంబర్ 19,2019) మధ్యాహ్నం ప్రారంభమైంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు భారీ ధర పలికారు. రూ.10.75 కోట్లకు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్ ను పంజాబ్ దక్కించుకుంది. ఇక ఇంగ్లండ్ ప్లేయర్ మోర్గాన్ ను రూ.5.25 కోట్లకు కోల్ కతా దక్కించుకుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ ను రూ.4.4 కోట్లకు బెంగళూరు కొనుగోలు చేసింది. క్రిస్ లిన్ ను రూ.2కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. ఇక భారత క్రికెటర్ రాబిన్ ఊతప్పను రూ.3 కోట్లకు రాజస్థాన్ జట్టు కొనుగోలు చేసింది.
ఈ వేలం కోసం మొత్తం 997మంది క్రికెటర్లు తమ పేర్లని రిజస్టర్ చేసుకున్నారు. ఆ జాబితాని బీసీసీఐ 332 మందికి కుదించింది. ఇందులో నుంచి ఐపీఎల్లోని 8 ఫ్రాంఛైజీలు కలిపి కేవలం 73 మందిని మాత్రమే కొనుగోలు చేసే వెసులబాటు ఉంది. ఈ 73 మంది క్రికెటర్లలో 23 మంది విదేశీ క్రికెటర్లు ఉండనున్నారు. గురువారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి వేలం ప్రారంభమైంది. అన్ని ఫ్రాంచైజీల చూపు ఆసీస్ స్టార్ క్రికెట్లరపైనే ఉంది. దీంతో వారికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
భారత్ నుంచి ఈ వేలంలో రూ. 1.5 కోట్ల కనీస ధరతో రాబిన్ ఉతప్ప ఉన్నాడు. పియూస్ చావ్లా, యూసఫ్ పఠాన్, జయదేవ్ ఉనద్కత్ రూ. కోటి ధరతో వేలంలోకి వచ్చారు. ఇక రూ. 50 లక్షల కనీస ధరతో పుజారా, హనుమ విహారి, స్టువర్ బిన్నీ, నమన్ ఓజా, మోహిత్ శర్మ, సౌరబ్ తివారి, మనోజ్ తివారి, రిషి ధావన్, బరిందర్ శరణ్ తదితరులు ఉన్నారు. 2019లో పుజారాని ఏ ఫ్రాంఛైజీ వేలంలో కొనుగోలు చేయలేదు. ఇక రూ. 2 కోట్ల కనీస ధరతో మాక్స్వెల్, క్రిస్లిన్, మిచెల్ మార్ష్, డేల్ స్టెయిన్, పాట్ కమిన్స్ తదితరులు ఉన్నారు.
ఐపీఎల్లో ఒక్కో టీమ్లో గరిష్టంగా 25 మంది క్రికెటర్లు మాత్రమే ఉండాలనేది రూల్. ఇందులో 8 మంది విదేశీ క్రికెటర్లు ఉండొచ్చు. అయితే.. తుది జట్టు (ప్లేయింగ్ 11)లో మాత్రం నలుగురు విదేశీ క్రికెటర్లని మాత్రమే ఆడించాల్సి ఉంటుంది. వేలంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ దగ్గర అత్యధికంగా రూ. 42.70 కోట్లు డబ్బు ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి 11 మంది ఆటగాళ్లని తీసుకునే వెసులుబాటు ఉంది. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ దగ్గర రూ. 17 కోట్లు ఉండగా.. ఏడుగుర్ని కొనుగోలు చేసే వీలుంది. ఇందులో ఇద్దరు విదేశీ క్రికెటర్లకి ఛాన్స్ దక్కనుంది. అత్యల్పంగా చెన్నై సూపర్ కింగ్స్ కేవలం ఐదుగురు ఆటగాళ్లని మాత్రమే వేలంలో కొనుగోలు చేసే వెసులబాటు ఉంది.
IPL 2020 క్రికెటర్ల వేలం:
* పాట్ కమిన్స్(ఆస్ట్రేలియా) ను రూ.15.50 కోట్లకు దక్కించుకున్న కోల్ కతా
* క్రిస్ లిన్(ఆస్ట్రేలియా) ను రూ.2కోట్లకు దక్కించుకున్న ముంబై ఇండియన్స్
* మోర్గాన్(ఇంగ్లండ్) ను రూ.5.25 కోట్లకు దక్కించుకున్న కోల్ కతా
* రాబిన్ ఊతప్ప(భారత్)ను రూ.3 కోట్లకు దక్కించుకున్న రాజస్థాన్
* జాసన్ రాయ్(ఇంగ్లండ్) ను రూ.1.5 కోట్లకు దక్కించుకున్న ఢిల్లీ
* ఆరోన్ ఫించ్(ఆస్ట్రేలియా) ను రూ.4.4 కోట్లకు దక్కించుకున్న బెంగళూరు
* మ్యాక్స్ వెల్(ఆస్ట్రేలియా) ను రూ.10.75 కోట్లకు దక్కించుకున్న పంజాబ్
* క్రిస్ వోక్స్(ఇంగ్లండ్) ను రూ.1.5 కోట్లకు దక్కించుకున్న ఢిల్లీ