అయ్యారే..: కివీస్‌కు భారీ టార్గెట్

అయ్యారే..: కివీస్‌కు భారీ టార్గెట్

Updated On : February 5, 2020 / 6:01 AM IST

టీ20 గెలిచిన ఉత్సాహంతో బరిలోకి దిగిన భారత్.. తొలి వన్డేలోనూ అద్భుతమైన బ్యాటింగ్ తీరు కనబరిచింది. ఆరంభంలో ఆచితూచి ఆడినా ఇన్నింగ్స్ మధ్యలో ఊపందుకుని కివీస్ ముందు 348పరుగుల టార్గెట్ ఉంచారు. కెప్టెన్ కోహ్లీ(51)అవుట్ అనంతరం స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కేఎల్ రాహుల్(88; 64 బంతుల్లో 3ఫోర్లు, 6సిక్సులు) పార్టనర్ షిప్ తో శ్రేయాస్ అయ్యర్(103; 107బంతుల్లో 11ఫోర్లు, 1సిక్సు) చెలరేగాడు. 

46వ ఓవర్ వద్ద అయ్యర్ అవుట్ అయినప్పటికీ కేదర్ జాదవ్(26)సహకారంతో రాహుల్ ఇన్నింగ్స్ ముగించాడు. ఓపెనర్లు పృథ్వీ షా(20), మయాంక్ అగర్వాల్(32)లు 9ఓవర్ల పాటు వికెట్లు కాపాడుకోగలిగారు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ 2వికెట్లు తీయగా, గ్రాండ్ హోమ్, ఇష్ సోధీ చెరో వికెట్ తీయగలిగారు. 

ఒకానొకదశలో 300పరుగులు చేయడమే కష్టం అనిపించిన సమయంలో కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ జట్టుకు బలాన్నిచ్చింది. 

ఇరు జట్లు:
India:
Prithvi Shaw, Mayank Agarwal, Virat Kohli (c), Shreyas Iyer, Lokesh Rahul (wk), Kedar Jadhav, Ravindra Jadeja, Shardul Thakur, Mohammed Shami, Kuldeep Yadav, Jasprit Bumrah

న్యూజిలాండ్:
Martin Guptill, Henry Nicholls, Tom Latham (c & wk), Tom Blundell, Ross Taylor, James Neesham, Colin de Grandhomme, Mitchell Santner, Tim Southee, Ish Sodhi, Hamish Bennett