Rishabh Pant : ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న రిషబ్ పంత్..! ఈ వీడియో చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది

ఐపీఎల్ టోర్నీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రిషబ్ పంత్ సిద్ధమవుతున్నాడు. ఇందుకోసం జిమ్ లో, మైదానంలో తీవ్రకసరత్తు చేస్తున్నాడు.

Rishabh Pant : ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న రిషబ్ పంత్..! ఈ వీడియో చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది

Rishabh Pant

IPL Rishabh Pant : ఐపీఎల్ 2024కు రంగం సిద్ధమవుతోంది. ఈనెల చివరిలో ఆటగాళ్ల వేలం ప్రక్రియ కొనసాగుతోంది. ఐపీఎల్ లో ఆడేందుకు స్వదేశంతోపాటు విదేశీ ప్లేయర్స్ పోటీ పడుతున్నారు. గతేడాది కారు ప్రమాదంలో గాయపడ్డ పంత్ గత ఐపీఎల్ టోర్నీకి దూరమయ్యాడు. ఈసారి ఐపీఎల్ లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో పునరాగమనంకోసం తీవ్రకసరత్తు చేస్తున్నాడు. ఐపీఎల్ మ్యాచ్ ల ప్రారంభం నాటికి పూర్తిస్థాయి ఫిట్ నెస్ తో ఉండేందుకు శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : Ravindra Jadeja : రవీంద్ర జడేజా, రివాబాల ప్రేమ కథ…డేటింగ్

భారత స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పత్ గతేడాది డిసెంబర్ లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. క్రమంగా పంత్ కోలుకుంటున్నాడు. ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసిన ఆటగాళ్లలో పంత్ కూడా ఉన్నాడు. అతను దక్షిణాఫ్రికాలో సిరీస్ కు భారత్ జట్టులో ఎంపిక కానప్పటికీ.. గత నెలలో జాదవ్ పూర్ యూనివర్శిటీ సాల్ట్ లేక్ క్యాంపస్ పిచ్ లో శిక్షణా శిబిరంలో డీసీ సహచరులతో చేరాడు. పంత్ మళ్లీ క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడాన్నిచూసిస్తోంది. ప్రస్తుతం తన బరువును తగ్గించుకొని ఫిట్ గా ఉండేందుకు పంత్ జిమ్ లో వర్కవుట్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకున్నాడు. ప్రతిక్షణం తిరిగి వస్తున్నాను అని పంత్ రాశాడు.

Also Read : PV Sindhu : ఎవరితోనైనా డేటింగ్ చేశారా?.. పీవీ సింధు తెలివైన సమాధానం

రిషబ్ పంత్ ఐపీఎల్ టోర్నీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే, ఇటీవల డీసీ జట్టు డైరెక్టర్, భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ విషయాన్ని దృవీకరించాడు. వచ్చే ఐపీఎల్ 2024 సీజన్ లో పంత్ ఆడతాడని, అతను ఇప్పుడు బాగున్నాడని చెప్పాడు. పంత్ భారత్ జట్టులో కీలక ఆటగాడు. గత ఏడాదిలో జూన్ లో దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 సిరీస్ లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. 2021లో ఐసీసీ పురుషుల టెస్టు జట్టులో ఎంపికయ్యాడు.

 

 

View this post on Instagram

 

A post shared by Rishabh Pant (@rishabpant)