IPL 2024 : క్రికెట్ ఫ్యాన్స్కు శుభవార్త.. ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తారట..!
ఐపీఎల్ 17వ సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. లీగ్ దశ ముగిసింది.
ఐపీఎల్ 17వ సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. లీగ్ దశ ముగిసింది. ప్లేఆఫ్స్కు నాలుగు జట్లు కోల్కతా నైట్రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లు చేరుకున్నాయి. కాగా.. రెండో స్థానంలో ప్లేఆఫ్స్లో అడుగుపెట్టాలని భావించిన రాజస్థాన్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. గౌహతి వేదికగా ఆదివారం కోల్కతాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం రాజస్థాన్కు గట్టి దెబ్బ కొట్టింది.
దీంతో సన్రైజర్స్, రాజస్థాన్ పాయింట్లు సమానం అయినప్పటికీ నెట్రన్రేటు కారణంగా సన్రైజర్స్ రెండో స్థానంతో, రాజస్థాన్ మూడో స్థానంతో ప్లేఆఫ్స్లో అడుగుపెట్టింది. దీని వల్ల క్వాలిఫయర్ 1 ఆడే అవకాశాన్ని రాజస్థాన్ కోల్పోయింది. కాగా.. గౌహతిలో ప్రత్యక్షంగా మ్యాచ్ చూడాలని భావించిన ప్రేక్షకులు వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో నిరాశ చెందారు. వారికి రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ శుభవార్త చెప్పింది.
RCB vs CSK : బెంగళూరు వర్సెస్ చెన్నై మ్యాచ్లో మిస్టరీ గర్ల్.. ఎంత అందంగా డ్యాన్స్ చేసిందో..!
ఒక్క బంతి కూడా పడకుండా మ్యాచ్ రద్దు కావడంతో అభిమానుల టికెట్ డబ్బులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లుగా ప్రకటించింది. దీంతో అభిమానులు కొంత ఊరట చెందుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సీజన్ ఫస్టాప్లో రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలలో అలరించింది. అయితే సెకండాప్లో అనూహ్యంగా చతికిల పడింది. ప్లే ఆఫ్స్కు ముందు వరుసగా నాలుగు మ్యాచుల్లోనూ ఓడిపోయింది. ఈ కారణంగా మూడో స్థానంతో ప్లేఆఫ్స్ లో అడుగుపెట్టిన రాజస్థాన్.. మే22న ఎలిలిమనేటర్లో ఆర్సీబీతో ఆడనుంది. ఈ మ్యాచ్లో ఓడిపోతే రాజస్థాన్ ఇంటి ముఖం పట్టక తప్పదు.