PAK vs SL : ఏం జరిగినా సరే పాక్తో మ్యాచ్లు ఆడాల్సిందే.. ప్లేయర్లకు లంక బోర్డు అల్టిమేటం..! లేదంటే..
శ్రీలంక జట్టు ప్రస్తుతం పాకిస్తాన్ (PAK vs SL) పర్యటనలో ఉంది.
SLC directs team to continue Pakistan tour despite safety concerns
PAK vs SL : శ్రీలంక జట్టు ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటనలో ఉంది. ఆతిథ్య పాక్తో మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. ఈ మ్యాచ్లకు రావల్సిండి ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పటికే తొలి వన్డే మ్యాచ్ పూరైంది. ఈ మ్యాచ్లో పాక్ విజయం సాధించింది. అయితే.. మంగళవారం ఇస్లామాబాద్లో బాంబు పేలుడు జరిగి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నేపథ్యంలో తమ భద్రతపై శ్రీలంక ఆటగాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు.
దాదాపు 8 నుంచి 9 మంది శ్రీలంక ఆటగాళ్లు తాము మ్యాచ్లు ఆడమని, స్వదేశానికి వచ్చేస్తామని లంక క్రికెట్ బోర్డుకు తెలిపారు. అయితే.. భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నప్పటికి కూడా పాక్ పర్యటనను కొనసాగించాలని లంక క్రికెట్ బోర్డు ప్లేయర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ భద్రత విషయమై ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపామని, అదనపు భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు పీసీబీ చీఫ్, పాక్ మంత్రి నఖ్వి తెలిపారని వెల్లడించింది. అనధికారికంగా తిరిగి వచ్చే ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Ravindra Jadeja : కెప్టెన్సీ ఇస్తేనే వస్తా.. రాజస్థాన్ రాయల్స్కు రవీంద్ర జడేజా కండీషన్..!
‘శ్రీలంక క్రికెట్ బోర్డు ఆదేశాలు ఉన్నప్పటికి కూడా ఏ ఆటగాడు లేదా సహాయక సిబ్బంది కూడా మధ్యలోనే తిరిగి వస్తే.. వారి చర్యలపై అధికారిక సమీక్ష నిర్వహించబడుతుంది. ఆ తరువాత వారిపై చర్యలు తీసుకుంటాం. వారి స్థానాల్లో కొత్త ఆటగాళ్లను పాక్కు పంపుతాం. ‘అని లంక బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
షెడ్యూల్లో స్వల్ప మార్పులు..
ఈ ఘటనల నేపథ్యంలో వన్డే సిరీస్ షెడ్యూల్లో పీసీబీ స్వల్ప మార్పులు చేసింది. గురువారం జరగాల్సిన రెండో వన్డే మ్యాచ్ శుక్రవారం, శనివారం జరగాల్సిన మూడో వన్డే ఆదివారం జరగనున్నట్లు తెలిపింది.
IPL trade : ఏమయ్యా అశ్విన్ ఇది నీకు తగునా? ట్రేడ్ డీల్ను లీక్ చేశావుగా..!
కాగా.. లంక జట్టు ఈ పర్యటనను కొనసాగించాలనే నిర్ణయాన్ని పీసీబీ చీఫ్ నఖ్వీ ప్రశంసించాడు.
