Kcr : 3 నెలల్లో అక్కడ ఉప ఎన్నిక రాబోతోంది, గెలుపు పక్కా- కేసీఆర్ హాట్ కామెంట్స్

కేంద్రంలో హంగ్ వస్తే.. పార్లమెంటులో బీఆర్ఎస్ కీలకం అవుతుంది. బీజేపీ చాలా ప్రమాదకరమైన పార్టీ.

Kcr : 3 నెలల్లో అక్కడ ఉప ఎన్నిక రాబోతోంది, గెలుపు పక్కా- కేసీఆర్ హాట్ కామెంట్స్

Kcr : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. కడియం శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేషన్ ఘన్ పూర్ లో 3 నెలల్లో ఉపఎన్నిక వస్తుందన్నారు. అక్కడ తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తారని జోస్యం చెప్పారు. గోదావరి నీళ్లను తరలించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని కేసీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వరంగల్ లో రోడ్ షో లో కేసీఆర్ మాట్లాడారు.

”ఓరుగల్లు చైతన్యం ఉన్న జిల్లా. చరిత్ర వైభవానికి ప్రతీక వరంగల్ జిల్లా. ఓరుగల్లు మట్టితో నాది విడదీయరాని బంధం. 5 మెడికల్ కాలేజీలు వరంగల్ ఉమ్మడి జిల్లాకు తెచ్చుకున్నాం. ఈ ముఖ్యమంత్రి విచిత్ర మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు. భూగోళం తెలియదు. కృష్ణా నది కూడా తనే కట్టాడట. ఏరి కోరి మొగుణ్ణి తెచ్చుకుంటే ఎగిరిఎగిరి తన్నట్లుంది తెలంగాణ పరిస్థితి. రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఈ ప్రభుత్వ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దివాళా తీసింది.

తెలంగాణ గొంతుకోసి గోదావరి జలాలను తమిళనాడుకు తరలించే కుట్రలు చేస్తున్నారు మోదీ. బాజప్తుగా గోదావరిని ఎత్తుకు పోతా అంటుంటే ఈ ముఖ్యమంత్రి మూతి ముడుచుకొని కూర్చున్నారు. బీజేపీకి 200 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కేంద్రంలో హంగ్ వస్తే.. పార్లమెంటులో బీఆర్ఎస్ కీలకం అవుతుంది. బీజేపీ చాలా ప్రమాదకరమైన పార్టీ. ప్రజల మధ్య పంచాయితీలు తప్ప మరో ప్రణాళిక లేదు. బీజేపీ ఎజెండాలో ప్రజల కష్టసుఖాలు ఉండవు. అచ్చే దిన్ రాలేదు. కానీ సచ్చే దిన్ వచ్చింది. రూపాయి విలువ 23 రూపాయలకు పడిపోయింది.

కడియం శ్రీహరి చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాధి చేసుకున్నారు. 3 నెలల్లో స్టేషన్ ఘన్ పూర్ కు ఉప ఎన్నిక రాబోతోంది. రాజయ్య MLA కాబోతున్నారు. రాజయ్య చేతిలో కడియం ఓటమి ఖాయం. గోదావరి, కృష్ణా నదులను కాపాడుకోవాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో BRS గెలవాలి. రేవంత్ రెడ్డి నా గుడ్లు పీకి గోళీలు ఆడుకుంటాడట. నా లాగు కూడా ఊడ తీస్తాడట. నన్ను చర్లపల్లి జైల్లో వేస్తాడట. నీ జైళ్ళు, తోకమట్ట దెబ్బలకు భయపడడు ఈ కేసీఆర్. ఇంకా చేయాల్సిన అభివృద్ధి చాలా ఉంది. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో వరంగల్ లో కట్టిన 24 అంతస్తుల ఆస్పత్రే నిదర్శనం” అని కేసీఆర్ అన్నారు.

Also Read : ఆ పార్టీకి వేసే ప్రతీ ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లే, కారు వాపస్ రాదు- సీఎం రేవంత్ రెడ్డి