బీజేపీతో సీఎం రేవంత్ ములాఖాత్.. బీఆర్ఎస్ లేకుండా చేయాలని కుట్ర: హరీశ్ రావు

లోక్‌స‌భ‌ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీ లాభపడుతుందని అన్నారు. బీఆర్ఎస్ మాత్రమే బీజేపీతో పోరాడుతోందని పేర్కొన్నారు.

బీజేపీతో సీఎం రేవంత్ ములాఖాత్.. బీఆర్ఎస్ లేకుండా చేయాలని కుట్ర: హరీశ్ రావు

BRS MLA Harish Rao: బీజేపీతో పోరాడటం వల్లే కేసీఆర్ కూతురు కవిత జైలుకు వెళ్లాల్సి వచ్చిందని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. బీజేపీతో తాము కలిసి ఉంటే కవిత అరెస్టు అయ్యేవారా అని ప్రశ్నించారు. సిద్దిపేట కొండా భూదేవి గార్డెన్స్ లో గురువారం ముస్లిం మైనార్టీల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీతో ములాఖాత్ అయి బీఆర్ఎస్ లేకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. లోక్‌స‌భ‌ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీ లాభపడుతుందని అన్నారు. బీఆర్ఎస్ మాత్రమే బీజేపీతో పోరాడుతోందని పేర్కొన్నారు.

కేసీఆర్ పదేళ్ల కాలంలో కర్ఫ్యూ లు, అల్లర్లు లేవన్నారు. నాలుగు నెలలు గడిచినా కాంగ్రెస్ 4 వేల పెన్షన్ ఇవ్వడం లేదని, రైతులకు బోనస్ కూడా వేయలేదని తెలిపారు. కాంగ్రెస్ వచ్చింది కేసీఆర్ కిట్ పోయింది, షాది ముభారక్ పోయింది. తులం బంగారం జాడ లేకుండా పోయింది. కేసీఆర్ ఒక సెక్యులర్ లీడర్.. రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో ఒక్క మైనార్టీ మంత్రి లేడు.. కేసీఆర్ క్యాబినెట్‌లో డిప్యూటీ సీఎం మైనార్టీ నేతకు ఇచ్చాం. సచార్ కమిటీ ప్రతిపాదనలను కాంగ్రెస్ ఎందుకు అమలు చేయడం లేదు.

13 తరువాత బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎవ్వరూ మీకు అందుబాటులో ఉండరు.. మళ్ళీ మీకు అందుబాటులో ఉండేది మేమే. హిందూ, ముస్లింలు రెండు కళ్లు లాగా పని చేస్తున్నాం. వెంకట్రామిరెడ్డి చదువుకున్న వ్యక్తి, ప్రజలకు మంచి సేవ చేసే వ్యక్తి. వెంకట్రామిరెడ్డిని గెలిపించుకొని పేదలు మైనార్టీలకు సాయం చేసుకుందామని హరీశ్ రావు అన్నారు.

Also Read: మాకు 10 సీట్లు ఇస్తే.. కేసీఆర్ శాసించే స్థాయికి వస్తారు- కేటీఆర్