KTR : మంత్రి కేటీఆర్ కు ఈసీ నోటీసులు
కేటీఆర్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం వ్యక్తం చేసింది.

CEC Notices to KTR
CEC Notices To KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. రాజకీయ కార్యకలాపాల కోసం ప్రభుత్వ ఆఫీసు టీ వర్క్స్ ను వాడుకున్నారని కాంగ్రెస్ నేత ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శనివారం ఈసీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు పంపింది. కేటీఆర్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల కల్లా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రణ్ దీప్ సూర్జేవాలా ఫిర్యాదు చేయడంతో ఈసీ కేటీఆర్ కు నోటీసులు పంపింది. టీవర్క్స్ లో జరిగిన స్టూడెంట్ ట్రైబ్ కార్యక్రమంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సూర్జేవాలా ఫిర్యాదు చేశారు. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసులు పేర్కొంది.
Amit Shah : బీఆర్ఎస్ కు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్లే : అమిత్ షా
ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని టీవర్క్స్ భేటీలో విద్యార్థులకు కేటీఆర్ హామీ ఇచ్చారని, అలాగే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని కూడా చెప్పారని తద్వారా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాజకీయ కార్యకలాపాలకు ప్రభుత్వ కార్యాలయం టీ వర్క్స్ ను ఉపయోగించుకున్నారని సూర్జేవాలా ఫర్యాదులో పేర్కొన్నారు.
సూర్జేవాలా ఫిర్యాదును పరిశీలించిన ఈసీ కేటీఆర్ ప్రాథమిక ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ కు ఈసీ నోటీసులు పంపింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల కల్లా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.