CM KCR : రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్
ఇప్పటికే సీఎం కేసీఆర్ ముహుర్తం ఖరారు చేశారు. ఇందుకు సమయం దగ్గరపడుతుంటంతో ఏర్పాట్లు, పనుల పరిస్థితిపై ముఖ్యమంత్రి ఫోకస్ పెట్టారు.

Yadadri 11zon
CM KCR Yadadri : సీఎం కేసీఆర్ రేపు యాదాద్రికి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. మార్చి 28న యాదాద్రి సన్నిధిలో మహాకుంభ సంప్రోక్షణం జరగనుంది. 21 నుంచి మహా సుదర్శనయాగాన్ని నిర్వహించనున్నారు.
ఇప్పటికే సీఎం కేసీఆర్ ముహుర్తం ఖరారు చేశారు. ఇందుకు సమయం దగ్గరపడుతుంటంతో ఏర్పాట్లు, పనుల పరిస్థితిపై ముఖ్యమంత్రి ఫోకస్ పెట్టారు. వీవీఐపీలు హాజరుకానుండటంతో భద్రతా అంశాలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.