CM Revanth Reddy : ప్రభుత్వంపై మీ విశ్వాసాన్ని కొనసాగించండి.. మీ అందరి మద్దతు ఉండాలి : సీఎం రేవంత్

CM Revanth Reddy : దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందన్నారు. రాహుల్ గాంధీ గారికి మీ అందరి మద్దతు ఉండాలని కోరుతున్నానని చెప్పారు.

CM Revanth Reddy : ప్రభుత్వంపై మీ విశ్వాసాన్ని కొనసాగించండి.. మీ అందరి మద్దతు ఉండాలి : సీఎం రేవంత్

CM Revanth Reddy Comments

Updated On : November 11, 2024 / 11:05 PM IST

CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో మత వివక్షకు తావులేదని, మతకల్లోలాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రతీ పేదవాడికి చేర్చే బాధ్యత తమ ప్రభుత్వానిదిగా ఆయన పేర్కొన్నారు. డా.సతీష్ గారు సమాజ సేవకు అంకితమై 35 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం (నవంబర్ 11) ఎల్బీ స్టేడియంలో కృతజ్ఞత కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 7, 2023న ఇదే ఎల్బీ స్టేడియంలో పేదల ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ మేం బాధ్యత తీసుకున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వంపై మీ విశ్వాసాన్ని ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు. దేశంలో ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదం పొంచి ఉందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించారని సీఎం రేవంత్ అన్నారు.

దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందన్నారు. రాహుల్ గాంధీ గారికి మీ అందరి మద్దతు ఉండాలని కోరుతున్నానని చెప్పారు. చెడును తొలగించి మంచిని పెంచేందుకు కృషి చేస్తున్న మీ అందరినీ అభినందిస్తున్నానని సీఎం రేవంత్ పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి ఎంతో బలమైందని, కుల, మతాలకు అతీతంగా ఇక్కడ అందరికీ గౌరవం ఉంటుందని చెప్పారు.

విద్య, వైద్య సేవల్లో క్రిస్టియన్ మిషనరీల కృషి అభినందనీయమన్నారు. విద్య వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో తక్కువ ఖర్చుతో క్రిస్టియన్ మిషనరీలు నాణ్యమైన విద్య అందిస్తున్నాయని సీఎం రేవంత్ కొనియాడారు. క్రిస్టియన్ మిషనరీలు నిర్వహిస్తున్న ఆసుపత్రులు ఆదర్శనీయంగా పేర్కొన్నారు. ప్రతీ పేదవాడికి సరైన వైద్యం అందించాలని ఆనాడు వైఎస్ రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారని సీఎం రేవంత్ గుర్తు చేసుకున్నారు.

కల్వరీ టెంపుల్‌ను అంత గొప్పగా నిర్వహించడం సతీష్‌కే సాధ్యమైందన్నారు. యువత వ్యసనాలకు బానిస కావడం సమాజానికి తీరని నష్టంగా పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ పీడ విరగడ చేసేలా సామాజిక బాధ్యతగా భక్తులకు సందేశం ఇవ్వాలని సతీష్‌ని కోరుతున్నాని చెప్పారు. గంజాయి, డ్రగ్స్ రూపుమాపేందుకు ప్రభుత్వం వైపు నుంచి మా వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. దైవ దూతగా మీ వైపు నుంచి మీవంతు బాధ్యత తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Read Also : AP MLC Elections 2024 : డిసెంబర్ 5న గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల!