Congress Protest : కాంగ్రెస్ నిరసనలో అపశృతి.. మాజీ డిప్యూటీ సీఎం రాజనర్సింహకు గాయాలు
చమురు ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యక్తంగా ఆందోళనలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం మెదక్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, టీపీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి గీత రెడ్డి హాజరయ్యారు

Congress Protest (2)
Congress Protest : చమురు ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యక్తంగా ఆందోళనలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం మెదక్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, టీపీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి గీత రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఎద్దుల బండిని తీసుకొచ్చారు కార్యకర్తలు.. ఈ నేపథ్యంలోనే దామోదర రాజనర్సింహాతోపాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు ఎద్దులబండి ఎక్కారు. ఎద్దుల బండిపై రాజనరసింహ తన ప్రసంగం ప్రారంభించారు. మైక్ సౌండు, కార్యకర్తల అరుపులకు బెదిరిన ఎద్దులు ఒక్కసారిగా కదిలాయి.
దీంతో ఎద్దులబండి కుదుపులకు గురై బండి మీదనుంచి కిందపడిపోయారు రాజనరసింహ. ఈ ప్రమాదంలో ఆయన మోకాలికి గాయమైంది. వెంటనే తేరుకున్న సెక్యూరిటీ సిబ్బంది ఆయనను పక్కకు లాగారు. ఈ ప్రమాదంతో నిరసన కార్యక్రమ అర్దాంతరంగా ముగిసింది.
Former Dy CM of United #AndhraPradesh Damodar Raja Narasimha injured after fall from a bullock cart during #FuelPriceHike protest organised by #Congress party in Medak of #Telangana pic.twitter.com/MmQ9jantc8
— Aashish (@Ashi_IndiaToday) July 12, 2021