ఖమ్మంలో మెడిసిన్ విద్యార్థికి కరోనా లక్షణాలు
ఖమ్మం జిల్లాలో కరోనా టెన్షన్ నెలకొంది. ఓ మెడిసిన్ విద్యార్థిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి.

ఖమ్మం జిల్లాలో కరోనా టెన్షన్ నెలకొంది. ఓ మెడిసిన్ విద్యార్థిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి.
ఖమ్మం జిల్లాలో కరోనా టెన్షన్ నెలకొంది. ఓ మెడిసిన్ విద్యార్థిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రి ఐసోలేటెడ్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అమెరికాలో చదువుతున్న ఈ విద్యార్థి ఈ నెల 7న తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి శాంపిల్స్ను సేకరించి పరీక్షల కోసం పంపిస్తున్నారు.
మరోవైపు హైదరాబాద్ ను కరోనా వైరస్ టెన్షన్ పెడుతోంది. నిన్న శంషాబాద్ విమానాశ్రయంలో కరోనా కలకలం రేపింది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా లక్షణాలు కనిపించాయి. అధికారులు అప్రమత్తం అయ్యారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. వారిని ఐసోలేషన్ వార్డులో ఉంచి పరీక్షలు నిర్వహించనున్నారు.
విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని థర్మల్ స్క్రీనింగ్ లో పరీక్షలు చేసిన తర్వాత ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. దుబాయ్ వరకు తమకు ఎలాంటి స్క్రీనింగ్ జరుగలేదని బ్రిటీష్ ఎయిర్ వేస్ లో చవ్చని ప్రయాణికులు చెప్పారు. వర్బల్ క్వెశ్చన్స్ అడిగారని తెలిపారు. దుబాయ్ లో తమకు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చారని పేర్కొన్నారు.
తెలంగాణలో కరోనాపై యుద్ధం ప్రకటించిన ప్రభుత్వం.. దానిని నియంత్రించడంలో సఫలం అవుతోంది. గాంధీలో చికిత్స పొందుతోన్న యువకుడికి కరోనా నెగెటివ్ ఇచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ…. సూచనలు , సలహాలు ఇస్తూ కట్టడికి చర్యలు తీసుకున్నారు.
See Also | పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారా? ప్రెగ్నెసీకి చలికాలమే సరైన సమయమంట, సైన్స్ చెప్పింది