కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు..

అన్నీ లెక్కలతో సహా ప్రజల ముందు పెడతామన్నారు. ప్రజల ఆస్తులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అన్నారు భట్టి విక్రమార్క.

కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు..

Bhatti Vikramarka Mallu : హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. హైదరాబాద్ నగరం అంటేనే లేక్స్, రాక్స్ (సరస్సులు, రాళ్లు) కు నెలవు అన్నారు. వీటిని కాపాడుకోవాలంటూ పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారని గుర్తు చేశారు. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు. చెరువులు ఏవీ ఆక్రమణకు గురికాకుండా పరిరక్షించడం కోసం ఏర్పాటు చేసిందే హైడ్రా అని ఆయన వివరించారు. హైడ్రాను ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారని భట్టి విక్రమార్క చెప్పారు. ప్రతి పనికి నోటీసులు ఇచ్చి ఆపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

బఫర్ జోన్ లో కాదు, నేరుగా చెరువులోనే నిర్మాణాలు చేపట్టారని, వాటిని కూల్చేస్తున్నారని భట్టి విక్రమార్క స్పష్టత ఇచ్చారు. శాటిలైట్ ఫోటోల ద్వారా విభజనకు ముందు, విభజన తర్వాత ఈ 10 ఏళ్లలో చెరువులు ఎంత మేర ఆక్రమణకు గురయ్యాయి తెలుసుకుంటున్నామన్నారు. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఫోటోలను తీసి, అంతకుముందు ఎన్ని చెరువులు ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అన్నది ప్రజల ముందు పెడతామన్నారు. చట్ట ప్రకారం, చట్టానికి లోబడి మాత్రమే చర్యలు చేపడతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తేల్చి చెప్పారు. అన్నీ లెక్కలతో సహా ప్రజల ముందు పెడతామన్నారు. ప్రజల ఆస్తులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అన్నారు భట్టి విక్రమార్క.

Also Read : ఎన్ కన్వెన్షన్ కూల్చివేతల్లో ట్విస్ట్.. మంత్రి ఫిర్యాదుతోనే రంగంలోకి హైడ్రా బృందం!