బీఆర్ఎస్కు మళ్లీ వలసల టెన్షన్ మొదలైందా? కాంగ్రెస్తో టచ్లో ఉన్న ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఆరా?
ఇప్పటికే ఏడాది కాలం గడిచిపోయిందని, మరో రెండేళ్లు గడిస్తే మళ్లీ ఎన్నికల హడావుడి మొదలవుతుందని, కచ్చితంగా ఈ సారి అధికారంలోకి వస్తామని ఎమ్మెల్యేలకు నచ్చజెప్పుతోందట బీఆర్ఎస్ నాయకత్వం.

KCR
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు మళ్లీ జంపింగ్ గుబులు పట్టుకుందట. గెలిచిన 39 సీట్లలో ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. సాయన్న కూతురు లాస్య నందిత అకాల మరణంతో సికింద్రాబాద్ సీటుకు బైపోల్ వచ్చింది. ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది.
దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ దగ్గర.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుతో కలిపి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు ఇప్పటికే ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్లో చేరిపోయారు. ఇందులో ఇంకొంత మంది కాంగ్రెస్లోకి వెళ్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా హైకోర్టు తీర్పు తర్వాత మళ్లీ గులాబీ పార్టీలో వలసల గుబులు మొదలైందట.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినా స్పీకర్ సకాలంలో స్పందించలేదని హైకోర్టుకు వెళ్లింది బీఆర్ఎస్ పార్టీ. దీంతో కోర్టు తీర్పు ఎలా వస్తుందోనన్న ఉత్కంఠ మధ్య కొన్నాళ్లు బీఆర్ఎస్ నుంచి వలసలు ఆగిపోయాయన్న చర్చ జరిగింది. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్కు టైం బాండ్ లేదని, తగిన సమయంలో డెసిషన్ తీసుకోవాలని సూచిస్తూ తీర్పు ఇచ్చింది హైకోర్టు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా చల్లబడిపోయిందట.
ఆ తీర్పులో బీఆర్ఎస్లో నిరాశ
బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై కచ్చితంగా హైకోర్టు వేటు వేస్తుందని ధీమాలో ఉన్న బీఆర్ఎస్కు తీర్పు నిరాశ కలిగించిందట. దీంతో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్లీ వలసలు మొదలవుతాయన్న ప్రచారం మొదలైంది. ఇందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్దంగా ఉన్నారని, అందులో కేటీఆర్ చుట్టూ తిరిగేవారే తమతో టచ్లో ఉన్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కామెంట్స్ చేశారు.
పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు అనుకూలంగా రాకపోవడానికి తోడు త్వరలో మరిన్ని వలసలుంటాయని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు అలర్ట్ అయ్యారట. ఇంకా ఎవరైనా ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారా అని ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలతో మాట్లాతూ వారిలో ఆత్మస్తైర్యాన్ని నింపుతున్నారట.
ఎమ్మెల్యేలకు నచ్చజెప్పుతున్న బీఆర్ఎస్ నాయకత్వం?
ఇప్పటికే ఏడాది కాలం గడిచిపోయిందని, మరో రెండేళ్లు గడిస్తే మళ్లీ ఎన్నికల హడావుడి మొదలవుతుందని, కచ్చితంగా ఈ సారి అధికారంలోకి వస్తామని ఎమ్మెల్యేలకు నచ్చజెప్పుతోందట బీఆర్ఎస్ నాయకత్వం. ఈ మధ్యే పొలిటికల్గా యాక్టివ్ అయిన కవిత కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ చేజారిపోకుండా ప్రయత్నిస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. మరికొంత మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోతే పార్టీ క్యాడర్ అంతా నీరుగారిపోతుందని ఆందోళన చెందుతున్న బీఆర్ఎస్..వారిని కాపాడుకునేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తోందట.
అయితే వచ్చే ఏడాది మార్చిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడున్న ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ఖాళీ కాబోతున్న నాలుగు స్థానాల్లో మూడు కాంగ్రెస్కు ఒకటి బీఆర్ఎస్కు రాబోతుంది. అయితే ఆ ఒక్క సీటును కూడా బీఆర్ఎస్కు దక్కకుండా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందట. అంతలోపే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగేయాలని అధికార పార్టీ ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దానిలో భాగంగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కామెంట్స్ చేశారన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా..? బీఆర్ఎస్ బుజ్జగింపులు వర్కౌట్ అవుతాయా అన్నది చూడాలి మరి.
అదానీ సెంట్రిక్గా రేవంత్, కేటీఆర్ డైలాగ్వార్.. ఆ ఇద్దరిలో అదానీతో దోస్తానీ ఎవరిది?