ఇదేనా నీ సంస్కారం..! సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై డీకే అరుణ ఆగ్రహం

నా బాగోతం ఏందో మీ బాగోతం ఏందో పాలమూరు చౌరస్తాలో తేల్చుకుందాం రండి.. ఒక్క మహిళను ఎదుర్కోవడానికి ఐదు సార్లు రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాకు వచ్చారని డీకే అరుణ అన్నారు.

ఇదేనా నీ సంస్కారం..! సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై డీకే అరుణ ఆగ్రహం

DK Aruna

DK Aruna : సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ మండిపడ్డారు. మహిళ అని చూడకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు.. నాపై ముప్పేట దాడి చేస్తున్నారు.. ఒక ఆడ బిడ్డను ఓడించేందుకు రాక్షసులుగా, రాబందులుగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అనే సోయిని మరిచి రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఒక పాలమూరు బిడ్డ ఈ ప్రాంతంకోసం అన్నిరంగాల్లో కృషి చేస్తే అసూయ పడుతున్నారు. అసలు రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం ఏనాడైనా పోరాటా చేశారా? అంటూ డీకే అరుణ ప్రశ్నించారు.

Also Read : Congress CPM Talks : కాంగ్రెస్‌కు మద్దతివ్వండి.. సీపీఎం నేతలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రధాని నరేంద్ర మోదీని నోటికొచ్చినట్లు మాట్లాడినవ్.. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న నీ స్థాయి ఏంటి? నా బాగోతం ఏందో మీ బాగోతం ఏందో పాలమూరు చౌరస్తాలో తేల్చుకుందాం రండి అంటూ రేవంత్ రెడ్డికి డీకే అరుణ సవాల్ విసిరారు. నీ మాటలు ఒక ముఖ్యమంత్రికి అగౌరవం.. నువ్వు దొరవి నీది దొర కుటుంబం.. మాది రైతు కుటుంబం.. పేదలకోసం పోరాటం చేసి చరిత్ర మాది. చిట్టెం నర్సిరెడ్డి గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదని డీకే అరుణ అన్నారు. మమ్మల్ని పండబెట్టి తొక్కుతారంట.. జాతి రంగు గురించి మాట్లాడుతున్నారు. ఏం పాపం చేశాను.. పాలమూరుకు నేను చేసిన ద్రోహం ఏంటి? ఇదేనా ఆడ పిల్లల గురించి మాట్లాడే సంస్కారం అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.

Also Read : CM Revanth Reddy : హైటెన్షన్ వైరు లాంటోడిని, టచ్ చేసి చూడు మాడిపోతావ్- కేసీఆర్‌కు సీఎం రేవంత్ వార్నింగ్

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంతమందికి ఆరోగ్యశ్రీ అందించారు? దీనిపై లెక్కలు చెప్పండి అంటూ డీకే అరుణ డిమాండ్ చేశారు. గ్యాస్ సిలిండర్ల ధర గురించి తప్పుడు లెక్కలు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఉజ్వల భవిష్యత్ ద్వారా పేదలకు అందించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీది. ఉజ్వల సిలిండర్ పేదలకు 528 రూపాయలకే ఇస్తున్నాం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ బోగస్.. ప్రజలను మోసం చేస్తున్నారు.. ఇకనైనా పచ్చి అబద్ధాలు మానెయ్ రేవంత్ రెడ్డీ అంటూ డీకే అరుణ సూచించారు. రైతులకు ఇచ్చిన హామీలు ఆగస్టు 15లోపు నెరవేర్చకపోతే రాజీనామా చేస్తావా? ఉద్యోగాల విషయంలో అన్నీ గాలి మాటలు చెబుతున్నారు.. జూటా మాటలు బంద్ చేయండి. లేకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారంటూ హెచ్చరించారు.

Also Read : Jagga Reddy : ఎవరి ఎమ్మెల్యేలు ఎవరితో టచ్‌లో ఉన్నారో ఎన్నికలయ్యాక తెలుస్తుంది- జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తూ ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ఓటు అడగాలి.. ఎంపీ ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత కాంగ్రెస్ కు లేదని డీకే అరుణ అన్నారు. ఒక్క మహిళను ఎదుర్కోవడానికి ఐదు సార్లు రేవంత్ పాలమూరు జిల్లాకు వచ్చారు. నరేంద్ర మోదీని మరోసారి ప్రజలు కోరుకుంటుంటే చూసి ఓర్వలేక ఆడపిల్ల అనిచూడకుండా నీచమైన మాటలు మాట్లాడుతున్నారు. ప్రతి పాలమూరు ఆడ బిడ్డ ఆలోచించాలి.. ప్రజల మధ్య ఉండే నాపై ఈ రకంగా బాష మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్ రేవంత్ అంటూ డీకే అరుణ హెచ్చరించారు.