నార్సింగిలో ఇంజనీర్ దారుణ హత్య.. కత్తితో గొంతుకోసిన మహిళ

హైదరాబాద్ శివారు ప్రాంతమైన నార్సింగిలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు.

నార్సింగిలో ఇంజనీర్ దారుణ హత్య.. కత్తితో గొంతుకోసిన మహిళ

Police Investigation

Crime News : హైదరాబాద్ శివారు ప్రాంతమైన నార్సింగిలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన నార్సింగ్ లోని గంధంగూడలోని ప్రధాన రోడ్ లో చోటు చేసుకుంది. పట్టపగలు ఇజాయత్ అలీ అనే ఇంజనీర్ ను దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. ఓ క్వాలీస్ కారులో ఇంజనీర్ ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చిన దుండగులు.. గొంతుకోసి హత మార్చారు. కారులో ఇద్దరు యువకులతో పాటు ఓ లేడి ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు మృతుడి కాళ్లు పట్టుకోగా.. మహిళ కత్తితో గొంతు కోసింది. కత్తితో గొంతుకోసిన దుండగులు కారును అక్కడే వదిలేసి పారిపోయారు.

Also Read : డి. శ్రీనివాస్‌ మరణం పట్ల వైఎస్ జగన్, కేటీఆర్ సంతాపం..

ఇజాయత్ అలీ దుబాయ్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. గత 20 రోజుల క్రితం ఇండియాకు వచ్చాడు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీమ్ బృందాలు రంగంలోకి దిగాయి. ‌పలు ఆధారాలును పోలీసులు సేకరించారు. అలీ ని ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? ఇక్కడికి ఏమని చెప్పి తీసుకొని వచ్చారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్వాలీస్ కారుతో పాటు రెండు ఫోన్లను నార్సింగి పోలీసులు సీజ్ చేశారు.