జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్..మేయర్ భార్య బొంతు శ్రీదేవి వెనుకంజ

  • Published By: bheemraj ,Published On : December 4, 2020 / 12:03 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్..మేయర్ భార్య బొంతు శ్రీదేవి వెనుకంజ

Updated On : December 4, 2020 / 12:20 PM IST

GHMC election counting : జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. చర్లపల్లి డివిజన్ లో టీఆర్ఎస్ అభ్యర్థి మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి వెనుకంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి కె.సురేందర్ ఆధిక్యంలో ఉన్నారు.



ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తైంది. రెగ్యులర్ బ్యాలెట్ మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం పోలైన ఓట్లు దాదాపు 35 లక్షలు. మొత్తం 1926 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు. కాసేపట్లో తొలి రౌండ్ లోనే మెహిదీపట్నం డివిజన్ ఫలితం వెలువడనుంది.