Trs plenary: ఎవ్వర్నీ వదిలేదిలే.. తెరాస నేతలకు జరిమానాల మోత

వారు అధికార పార్టీ నేతలు, అందులోనూ అధికార తెరాస పార్టీ ప్లీనరీ జరుగుతుంది. ఇక మనోళ్లు ఆగుతరా.. భాగ్యనగరంలోని ప్లీనరీ జరిగిన ప్రాంతాలన్నీ ప్లెక్సీ మయం అయ్యారు. నగరంలో ప్రధాన...

Trs plenary: ఎవ్వర్నీ వదిలేదిలే.. తెరాస నేతలకు జరిమానాల మోత

Trs Flexis1

Updated On : April 28, 2022 / 8:17 AM IST

Trs plenary: వారు అధికార పార్టీ నేతలు, అందులోనూ అధికార తెరాస పార్టీ ప్లీనరీ జరుగుతుంది. ఇక మనోళ్లు ఆగుతరా.. భాగ్యనగరంలోని ప్లీనరీ జరిగిన ప్రాంతాలన్నీ ప్లెక్సీ మయం అయ్యారు. నగరంలో ప్రధాన రహదారులపై ప్లెక్సీలు పెట్టొద్దనే నిబంధన ఉంది. ఒకవేళ పెడితే జరిమానాలు విధించేందుకు అధికారులు సిద్ధంగా ఉంటారు. అయితే అధికార పార్టీ నేతలు మేమేగా అధికారంలో ఉంది.. మాకెందుకు జరిమానాలు విధిస్తారే అనుకున్నారో ఏమో.. ప్లెక్సీలతో నింపేశారు. తొలుత అధికారులు ఎలాంటి చర్యలకు ఉపక్రమించక పోయినా.. తెరాస నేతల తీరుపై సోషల్ మీడియాలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రధాన రహదారులపై ప్లెక్సీలు ఏర్పాటు వల్ల పలు ప్రమాదాలు చోటుచేసుకొనే అవకాశం ఉందంటూ.. సోషల్ మీడియా ప్లాట్ ఫాం వేదికగా పౌరుల నుండి ఈవీడీఎంలోని సెంట్రల్ ఎన్ ఫోర్స్ మెంట్ సెల్ (సీఈసీ)కి ఫిర్యాదులు వెల్లవెత్తాయి.

TRS Plenary : టీఆర్ఎస్ ఫ్లెక్సీల ఏర్పాటుపై కేఏ పాల్ పిటిషన్

స్పందించిన సీఈసీ ఈ- చలాన్ల జారీ ప్రక్రియను ప్రారంభించింది. అయితే ప్లెక్సీని తొలగించే బాధ్యత మాత్రం తమది కాదంటూ జోనల్, సర్కిల్ అధికారులదని తెలిపారు. అయితే ట్విటర్ ద్వారా సీఈసీ కి అందిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని జరిమానాలు విధిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డివిజన్ నాయకులకు ఈ-చలాన్లు విధించారు. మంత్రి శ్రీనివాస్ యాదవ్ పేరిట నగరంలోని జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్క్, పంజాగుట్ట, నాంపల్లి, నారాయణగూడ, చాదర్ ఘాట్, అంబర్ పేట, తార్నాక, ప్యాట్నీ, ఈస్ట్ మారేడ్ పల్లి, మెట్టగూడ తదితర ప్రాంతాల్లో వెలసిన ప్లెక్సీలపై అందిన ఫిర్యాదులకు ఈ- చలానాలు జారీ చేశారు. ఒక్కో ప్లెక్సీకి రూ. 5వేల వరకు చలానాలు విధించారు.

TRS Plenary : కేంద్ర సర్కార్‌‌పై కేటీఆర్ నిప్పులు.. ప్లీనరీలో పవర్ ఫుల్ స్పీచ్

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు ట్విటర్ లో అందిన ఫిర్యాదుల మేరకు భారీగా జరిమానాలు విధించారు. అయితే ప్లెక్సీలకు నగరంలో ఎంతమొత్తం జరిమానాలు విధించారనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే గతేడాది అక్టోబర్ లో జరిగిన తెరాస విస్తృత స్థాయి సమవేశం సందర్భంగా నగరంలో భారీగా కటౌట్లు, ప్లెక్సీలను తెరాస నేతలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆ పార్టీ నాయకులకు జీహెచ్ ఎంసీ భారీ ఎత్తున జరిమానాలు విధించింది. ఈ క్రమంలో తలసానికి రూ. 5లక్షలు, రాగం సుజాత నాగేందర్ కు రూ. 5లక్షలు, మేయర్ విజయలక్ష్మికి రూ. 30వేలు ఇలా ఈవీడీఎం అధికారులు ఈ-చలాన్లు జారీ చేసిన విషయం విధితమే.