కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ

జీహెచ్ఎంసీ మేయర్, బీఆర్ఎస్ నేత గద్వాల విజయలక్ష్మీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్న ..

కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ

GHMC Mayor Gadwala Vijayalakshmi

GHMC Mayor Gadwal Vijaya Laxmi : జీహెచ్ఎంసీ మేయర్, బీఆర్ఎస్ నేత గద్వాల విజయలక్ష్మీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్న విజయలక్ష్మీ .. రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీపాదాస్ మున్షి ఆమెకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.

Also Read : KK Key Comments : తెలంగాణ ఏర్పడింది ముమ్మాటికీ కాంగ్రెస్ వల్లే..

లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరిగాయి. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థంపుచ్చుకోగా.. మరికొందరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. మేయర్ గద్వాల విజయలక్ష్మీ తాజాగా కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. ఆమె తండ్రి, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు, బీఆర్ఎస్ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్యలు హస్తం గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. వీరు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

Also Read : ఇప్పటివరకు బీఆర్ఎస్‌ను వీడిన కీలక నేతలు వీరే.. ఇంకా ఏం జరుగుతోందో తెలుసా?

రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అయితే, ఏప్రిల్ 6న ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఆరోజు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన జాతర సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలు హాజరు కానున్నారు. వీరి సమక్షంలో కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది. మరోవైపు కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్యలు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఆ తరువాత వారు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.