Gone Prakash Rao : జమిలి ఎన్నికలు సాధ్యం కాదు.. కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారు : గోనె ప్రకాష్ రావు

బీజేపీ కొంతమంది ఫైల్స్ చేతిలో పెట్టుకొని బ్లాక్ మెయిల్స్ చేస్తుందన్నారు. జమిలి ఎన్నికలు జరగాలంటే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజీనామా చేయాలన్నారు.

Gone Prakash Rao : జమిలి ఎన్నికలు సాధ్యం కాదు.. కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారు : గోనె ప్రకాష్ రావు

Gone Prakash Rao

Gone Prakash Rao Criticized BJP : బీజేపీ పార్టీ, రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. జమిలి ఎన్నికలపై కమిటీ డ్రామా అని పేర్కొన్నారు. బీజేపీ కొంతమంది ఫైల్స్ చేతిలో పెట్టుకొని బ్లాక్ మెయిల్స్ చేస్తుందన్నారు. జమిలి ఎన్నికలు అంటే 29 రాష్ట్రాల్లో జరగాలని.. అది అయ్యే పని కాదన్నారు. దానికి రాజ్యాంగ సవరణ జరగాలని తెలిపారు. జమిలి ఎన్నికలు జరగాలంటే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజీనామా చేయాలన్నారు.

పార్టీ మార్పుల బిల్లు పెండింగ్ లో పెడుతున్నారని పేర్కొన్నారు. ఎర్రబెలి దయాకర్ రావు పార్టీ మారనున్నారని వెల్లడించారు. ఎర్రబెల్లి పార్టీ మారిన తర్వాత ఇప్పుడు మంత్రి అయ్యారని తెలిపారు. రేవంత్ రెడ్డి షర్మిలను ఆంధ్ర అంటున్నారని పేర్కొన్నారు. సీపీఐ, ఎంఐఎం సమైక్య నినాదం ఇచ్చాయి.. వాటితో పొత్తులకు సిద్ధమవుతున్న రేవంత్ రెడ్డికి సిగ్గు లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Challa Babu : పుంగనూరు అల్లర్ల కేసు.. పోలీసులకు లొంగిపోయిన చల్లా బాబుతోపాటు టీడీపీ నేతలు

కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తుందనే తాను ఓటు హక్కు నమోదు చేసుకోలేదని స్పష్టం చేశారు. పార్టీ ఓటమికి రేవంత్ రెడ్డే బాధ్యత వహించాలన్నారు. బీ ఫామ్ లు ఇచ్చిన తర్వాత మార్చిన రోజులున్నాయని గుర్తు చేశారు. చివరి నిమిషంలో బలవంతుడు వస్తే అభ్యర్థి మారే అవకాశం కరీంనగర్ లో ఉందన్నారు.