Nalgonda : పెళ్లి పేరుతో 19 మంది యువతులను మోసం చేసిన కేటుగాడు
పెళ్లి చేసుకుంటానని నమ్మించి 19 మంది యువతులను మోసం చేసిన విలియమ్స్ అనే వ్యక్తిపై నల్గొండలో కేసు నమోదైంది.
Nalgonda : పెళ్లి చేసుకుంటానని నమ్మించి 19 మంది యువతులను మోసం చేసిన విలియమ్స్ అనే వ్యక్తిపై నల్గొండలో కేసు నమోదైంది. స్థానికంగా ఉండే చర్చిలో పియానో వాయించే యితడు చర్చికి వచ్చే యువతులను టార్గెట్ చేసేవాడని, వారితో పరిచయం పెంచుకొని మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకొని మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇతడి మొదటి భార్య.
చదవండి : Nalgonda : జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య
మొత్తం 19 మంది యువతులను పెళ్లి పేర మోసం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. చర్చికి వచ్చే వారితో మాటలు కలిపి ఈ విధంగా చేశాడని తెలిపింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విలియమ్స్ ను అదుపులోకి తీసుకుందుకు వెళ్లగా.. గుండెపోటు వచ్చిందని చెప్పి ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.