Hyderabad : హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. 27వరకు ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే..
Hyderabad : హైదరాబాద్ లో ఈనెల 27వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా రేపు మారథాన్ కారణంగా పలు ప్రాంతాల్లో ..

Hyderabad
Hyderabad : హైదరాబాద్లో ఈనెల 27వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు (ఆదివారం) మారథాన్ కారణంగా (Hyderabad) పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించగా.. పలు ప్రాంతాల్లో గణేశ్ విగ్రహాల విక్రయం, కొనుగోలు, తరలింపు కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఈనెల 27వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
రేపు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
♦ హైదరాబాద్(Hyderabad)లో ఆదివారం జరగనున్న రన్నర్స్ మారథాన్ సందర్భంగా పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 4.30 నుంచి 9గంటల వరకు పలు మార్గాల్లో ట్రాఫింక్ మళ్ళింపు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
♦ బైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను వివి స్టాచ్యూ వద్ద షాదాన్, నీరంకారి భవన్ వైపు మళ్లిస్తారు. దీంతో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వాహనదారులు. జెసిపి జంక్షన్ వద్ద తాజ్ కృష్ణ, రోడ్డు సం. 10, 12, ఒరిస్సా ఐలాండ్ మీదుగా వెళ్లాలి. ఇక్బాల్ మీనార్, లిబర్టీ, కర్బలా, ముషీరాబా డ్, జబ్బార్ కాంప్లెక్స్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ ను లోయర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తారు.
♦ మినిస్టర్స్ రోడ్, రాణిగంజ్ నుంచి వచ్చే ట్రాఫిక్ ను నల్లగుట్ట జంక్షన్ వద్ద దారి మళ్లిస్తారు. బేగంపేట నుంచి రాజ్ భవన్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ వైపు వచ్చే వాహనాలు గ్రీన్ ల్యాండ్స్ జంక్షన్ వద్ద డి.కె. రోడ్, అమీర్ పేట మీదుగా వెళ్లాలి.
♦ మారథాన్ పంజాగుట్ట ఫ్లైఓవర్లోకి ప్రవేశించినప్పుడు. పంజాగుట్ట నుంచి రోడ్డు నం. 2 వైపు వెళ్లే ట్రాఫిక్ను ఎన్ఎస్సిఎల్ జంక్షన్ వద్ద రోడ్డు నం.1 వైపు మళ్లిస్తారు.
♦ శ్రీనగర్ కాలనీ, కమలాపురి కాలనీ నుంచి రోడ్డు నం.2, బంజారాహిల్స్ వైపు వెళ్లే వాహనదారులు ఎస్ఎస్టీ, సాగర్ సొసైటీ జంక్షన్ల వద్ద దారి మళ్లింపులను గమనించి, కమలాపురి కాలనీ, గ్రీన్ బావర్చి, వెంకటగిరి మీదుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలి.
♦ ఎన్టీఆర్ భవన్ వైపు వచ్చే ట్రాఫిక్ను ఆయా జంక్షన్ల వద్ద దారి మళ్లిస్తారు. బీవీబీ జంక్షన్, ఫిల్మ్ నగర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వచ్చే వాహనాలను జర్నలిస్ట్ కాలనీ వద్ద రోడ్డు నెం. 70, హాట్కప్ మీదుగా మాదాపూర్ వైపు మళ్లిస్తారు. మారథాన్ రోడ్డు నెం. 45 వైపు వెళ్లినప్పుడు. అక్కడి మార్గాల్లోని ట్రాఫిక్ను రోడ్డు నెం. 36, రోడ్డు నెం.2 వైపు మళ్లిస్తారు.
♦ అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్ లైవ్ నెం. 9010203626 కు సంప్రదించాలని, మారథాన్ సురక్షితంగా, విజయ వంతంగా ముగిసేందుకు సహకరించాలని పోలీసులు కోరారు.
సైబరాబాద్ పరిధిలో ఇలా..
♦ నెక్లెస్ రోడ్డు నుంచి హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్.. ఖానామెట్ మీదుగా ఆదివారం గచ్చిబౌలి స్టేడియం వరకు మారదాన్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నల 11:30 గంటల వరకు వివిధ మార్గాల్లో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు.
♦ లింగంపల్లి నుంచి ఐఐఐటీ జంక్షన్ ద్వారా వచ్చే ట్రాఫిక్ ను షేక్పేట ఫైఓవర్, బయోడైవర్సిటీ లెవల్ 2 ఫ్లైఓవర్కు మళ్లిస్తారు.
♦ జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 నుంచి వచ్చే వాహనాలు కేబుల్ బ్రిడ్జి, రోలింగ్ హిల్స్ రోడ్డు మీదుగా వెళ్లాలి. కొత్తగూడ నుంచి సైబర్ టవర్స్ వైపు ఉదయం 7:15 గంటల వరకు ట్రాఫిక్ను అనుమతించరు. ఖాజాగూడ జంక్షన్ వద్ద కుడి వైపు రోడ్డు తీసుకొని బయోడైవర్సిటీ లెవల్ ఫ్లైఓవర్ మీదుగా గచ్చిబౌలీ ఫ్లైఓవర్, ఐఐఐటీ జంక్షన్, మస్జీద్ బండ జంక్షన్ చేరుకుని అక్కడి నుండి లింగంపల్లికి వెళ్లాలి.
♦ ఓఆర్ఆర్ వైపు వెళ్లే వాహనాలు ఖాజాగూడ జంక్షన్ వద్ద ఎడమవైపు తిరిగి నానక్ రాంగూడ నుంచి ఓఆర్ఆర్కి వెళ్లవచ్చు. ఇందిరానగర్ నుంచి హెచ్సీయూ గేట్ నం.2 వరకు ఐఐఐటీ జంక్షన్ ద్వారా మధ్యాహ్నం 11.30 గంటల వరకు ట్రాఫిక్కు అనుమతి లేదు. కొత్తగూడ/కొండాపూర్ వైపు వెళ్లే వాహనాలు బయోడైవర్సిటీ లెవల్1 ఫ్లైఓవర్, ఐకియా అండర్ పాస్, లెమన్ ట్రీ, టెక్ మహీంద్రా, సీఐఐ మీదుగా వెళ్లాలి.
♦ జూబ్లీహిల్స్ రోడ్ నం.45 ఫ్లైఓవర్, కేబుల్ బ్రిడ్జి ఉదయం 8:30 గంటల వరకు మూసివేస్తారు.
♦ కేపీహెచ్బీ, కొత్తగూడ, కొండాపూర్ వైపు వెళ్లే వాహనాలు మాదాపూర్ మెయిన్ రోడ్డు, సైబర్ టవర్స్, యశోద హాస్పిటల్ మీదుగా వెళ్లాలి.
♦ ఏఐజీ హాస్పిటల్ వైపు వెళ్లే వాహనాలు సైబర్ టవర్స్ నుంచి ఎడమవైపు తిరిగి, సీఓడీ, వెస్టిన్, మైండ్ స్పేస్ రోటరీ, ఐకియా రోటరీ మీదుగా వెళ్లాలి.
♦ కొత్తగూడ, కొండాపూర్ వైపు వెళ్లే వాహనాలు సైబర్ టవర్స్ నుంచి సీఓడీ, మైండ్ స్పేస్ రోటరీ, ఐకియా రోటరీ, ఏఐజీ మీదుగా బొటానికల్ గార్డెన్ వైపు వెళ్లాలి.
♦ సైబర్ టవర్స్ నుంచి కొత్తగూడ వరకు ఉదయం 7.30 గంటల వరకు, ఐకియా వరకు ఉదయం 8గంటల వరకు ట్రాఫిక్ కు అనుమతి లేదు.
27వరకు ఈ రూట్లు బంద్..
ధూల్ పేటలో గణేశ్ విగ్రహాల విక్రయం. కొనుగోలు, తరలింపు కారణంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి బుధవారం (27వ తేదీ) రాత్రి 10 గంటల వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ వెల్లడించారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇవీ..
♦ బోయిగూడ కమాన్ నుంచి గాంధీ విగ్రహం వరకు.. అలాగే దానికి ఎదురుగా వచ్చే సాధారణ వాహనాలకు ఈ నాలుగు రోజులు అనుమతి ఉందదు.
♦ గణేశ్ విగ్రహాలను తరలించే వాహనాలు గాంధీ విగ్రహం, పురానాపూల్ వైపు నుంచి ప్రవేశించి బోయిగూడ కమాన్ క్రాస్ రోడ్స్ నుంచి బయటకు వెళ్లాలి.
♦ గాంధీ విగ్రహం పురానాపూల్ నుంచి మంగళహాల్ వైపు వెళ్లే సాధారణ వాహనాలను.. తక్కర్వాడి టీ జంక్షన్, జిన్నీచౌరాహీ, ఘోడేకేఖబర్ వైపు మళ్లిస్తారు.
♦ సీతారాంబాగ్ నుంచి మంగళహాట్, పురానాపూల్ వైపు వెళ్లే వాహనాలు బోయిగూడ కమాన్ వద్ద కార్వాన్ రోడ్ వైపు మళ్లిస్తారు.
♦ దరుస్సలాం నుంచి మంగళహాట్, పురానాపూల్ వైపు వెళ్లే వాహనాలు బోయిగూడ కమాన్ వద్ద అఘాపుర, ఘోడేకేఖబర్, జిన్నీచౌరాహీ, తక్కర్వాడీ టీజంక్షన్ మీదుగా వెళ్లాలి.
♦ గణేశ్ విగ్రహాల రవాణా కోసం వచ్చే లారీలు, డీసీఎంలు జుమ్మేరత్ బజార్ గ్రౌండ్ లో పార్క్ చేయాలి. ఈ వాహనాలకు రాత్రి 10గంటల తరువాతే విగ్రహాలను తీసుకెళ్లడానికి అనుమతి ఉందని జాయింట్ సీపీ తెలిపారు. ఒకవేళ భారీ వర్షాలు కురిస్తే లారీటు, డీసీఎంలు 100 ఫీట్ రోడ్డు, పురానాపూల్ వద్ద పార్క్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే, ఎంజే బ్రిడ్జ్ నుంచి జుమ్మేరత్ బజార్ రోడ్డు వరకు ఒకే లైన్ లో వాహనాలను పార్క్ చేసుకోవచ్చునని చెప్పారు.