MGBS : ఓటేసేందుకు సొంతూళ్లకు తరలి వెళ్తున్న ప్రజలు.. ఎంజీబీఎస్ బస్టాండ్ లో కిక్కిరిసిన ప్రయాణికులు

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు.

MGBS : ఓటేసేందుకు సొంతూళ్లకు తరలి వెళ్తున్న ప్రజలు.. ఎంజీబీఎస్ బస్టాండ్ లో కిక్కిరిసిన ప్రయాణికులు

MGBS bus stand (1)

MGBS People Crowd : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. హైదరాబాద్ లో నివసిస్తున్న గ్రామాల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంతూళ్లకు తరలి వెళ్తున్నారు. ఈనేపథ్యంలో ఎంజీబీఎస్ వద్ద ప్రయాణికుల రద్దీ నెలకొంది. ఓటు వేసేందుకు వెళ్లున్న ప్రయాణికులతో బస్ స్టేషన్ కిటకిటలాడుతోంది.

ఓటు హక్కు వినియోగించుకోవడానికి సొంతూళ్లకు వెళ్తున్న వారితో ఎంజీబీఎస్ బస్ స్టేషన్ కిక్కిరిసింది. ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లోని పలు ఫ్లాట్ పామ్స్ దగ్గర ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. సూర్యాపేట, మహబూబ్ నగర్, ఖమ్మం, కోదాడ మార్గాల్లో బస్సుల కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ పిలుపునిచ్చాయి.

KTR : ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. తెలంగాణ ప్రగతికి పునాదిగా నిలవాలి : మంత్రి కేటీఆర్

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు, సెలబ్రెటీలు ఓటు హక్కు వినిగించుకుంటున్నారు. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 119 నియోజకర్గాల్లో 2,290 మంది ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

తెలంగాణలో 33 జిల్లాలోని 119 అసెంబ్లీ నియోజకర్గాలకు ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. పోలీసుల నిఘా నీడలో పోలింగ్ కొనసాగుతోంది. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలింగ్ జరుగుతోంది. లక్షమంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. డిసెంబర్ 3న ఓట్ల కౌంటింగ్ జరుగునుంది.