Harish Rao : కేసీఆర్ గెలిస్తే అందరం బాగుపడతాం లేదంటే బాధ పడతాం : మంత్రి హరీష్ రావు

బీజేపీ వాళ్ళు పేదల కోసం ఒక్క మంచి పని అయినా చేశారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఉన్న నాడు ఇన్వర్టర్స్, కన్వర్టర్ అని గుర్తు చేశారు.

Harish Rao : కేసీఆర్ గెలిస్తే అందరం బాగుపడతాం లేదంటే బాధ పడతాం : మంత్రి హరీష్ రావు

Minister Harish Rao (1)

Harish Rao Road Show : గులాబీ జెండా రాకముందు పరిస్థితి ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. నాడు నీళ్ళ కోసం ఎంతో గోస ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా అని అన్నారు. రేషన్ షాపుల ద్వారా పాత బియ్యం, సన్నబియ్యం ఇవ్వబోతున్నామని తెలిపారు. మహిళల కోసం సౌభాగ్య లక్ష్మి పథకం అమలు చేయబోతున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే మళ్లీ రూ.400లకే సిలిండర్ ఇవ్వబోతున్నామని వెల్లడించారు. శనివారం నిజామాబాద్ అర్బన్ రోడ్ షో లో మంత్రి హరీశ్ రావు పాల్గొని, మాట్లాడారు.

రైతు బీమా లాగా కోటి కుటుంబాలకు రూ.5 లక్షల బీమా అందించబోతున్నామని తెలిపారు. కేసీఆర్ రాకముందు నిజామాబాద్ ఎంత మారింది ఇప్పుడు ఎంత మారిందన్నారు. రఘునాథ్ చెరువును అద్భుతంగా అభివృద్ధి చేశారని కొనియాడారు. బీజేపీ వాళ్ళు పేదల కోసం ఒక్క మంచి పని అయినా చేశారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఉన్న నాడు ఇన్వర్టర్స్, కన్వర్టర్ అని గుర్తు చేశారు. ఓడ దాటే దాకా ఓడ మల్లన్న ఓడ దాటాటక బొడి మల్లన్న అన్నట్టుంది అని విమర్శించారు.

Etela slams HarishRao: హరీశ్‭రావు మీద షాకింగ్ కామెంట్స్ చేసిన ఈటల రాజేందర్

నమ్మి ఓటు వేస్తే నట్టేట ముంచారని ఆరోపించారు. ఆపద మొక్కులు మొక్కుతున్నారని, ఓట్లు డబ్బాలో పడితే ఎగ్గొట్టేందుకు చూస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ గెలిస్తే అందరం బాగు పడతాం లేదంటే అందరం బాధ పడతామని చెప్పారు. కాంగ్రెస్ కాకమ్మ కథలు నమ్మొద్దని ఒకవేళ నమ్మితే మోస పోతామని చెప్పారు. భూతు మాట్లాడే నాయకులకు భూతుల్లోనే సమాధానం చెప్పాలన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అని అన్నారు. షబ్బీర్ అలీ కామారెడ్డిలో గెలవలేదు, ఎల్లారెడ్డిలో గెలవలేదు ఇప్పుడు ఇక్కడకు వచ్చారని తెలిపారు. అక్కడ చెల్లని షబ్బీర్ అలీ ఇక్కడ ఎలా చెల్లుతాడని ప్రశ్నించారు.