New Year 2024: న్యూ ఇయర్ వేడుకల వేళ పోలీసుల సరికొత్త ప్రయోగం.. ఇలా దొరికిపోతారంతే..
పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు డ్రగ్స్ తీసుకుని ప్లబ్బుల్లో డ్యాన్సులు చేస్తుంటారు. ఆ తర్వాత..
నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబరు 31న అర్ధరాత్రి యువత చేసే హంగామా అంతాఇంతా కాదు. పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు డ్రగ్స్ తీసుకుని ప్లబ్బుల్లో డ్యాన్సులు చేస్తుంటారు.
ప్లబ్బుల్లో పని అయిపోయాక అదే మత్తులో రోడ్లపై వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుంటారు. దీంతో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రేపు హైదరాబాద్ పోలీసులు సరికొత్త ప్రయోగం చేయనున్నారు. మద్యం తాగి వాహనాలు నడపడమే కాదు, ఎటువంటి డ్రగ్స్ తీసుకున్నా ఇక తప్పించుకోలేరు. డ్రగ్స్ తీసుకునే వారిని పట్టుకునేందుకు ఏం చేస్తున్నామన్న వివరాలను నార్కోటిక్ బ్యూరో ఏసీపీ దీపక్ 10 టీవీకి వివరించి తెలిపారు.
మత్తుపదార్థాల డిటెక్టర్ టెస్ట్ల కోసం నార్కోటిక్ పోలీసులు 100 పరికరాలు కొన్నారు. అబోట్, డ్రాగర్ కంపెనీలకు చెందిన ఈ పరికరాలు మనిషి శరీరంలో డ్రగ్స్ను డిటెక్ట్ చేస్తాయి ఈ పరికరాలు. మూడు పద్ధతుల ద్వారా పోలీసులు డ్రగ్స్ టెస్ట్ చేస్తారు. లాలాజలం, యూరిన్ శాంపిల్ ద్వారా డ్రగ్స్ డిటెక్ట్ చేస్తారు. దాని ఫలితాలు రావడానికి కొన్ని రోజులు పడుతుందని అనుకుంటున్నారా? శాంపిల్ తీసుకున్న 6-8 నిమిషాల్లో ఫలితాలు వచ్చేస్తాయి.
ఒక్కో పరికరాన్ని 13 లక్షలు పెట్టి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో డివైస్కు ప్రత్యేక క్యాట్ రిడ్జ్లు ఉంటాయి. ఇంతకు ముందు వరకు గోవా, కేరళలోనే ఈ డ్రగ్ డిటెక్ట్ డివైస్లు అందుబాటులో ఉండేవి. రేపు మన దగ్గర కూడా డ్రగ్స్ హాట్ స్పాట్ వద్ద డ్రగ్స్ డ్రైవ్ ఉంటుంది జాగ్రత్త.
హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి 10 టీవీతో ఏమన్నారంటే?
- న్యూ ఇయర్ వేడుకల కోసం అంతా సిద్ధంగా ఉన్నాం..
- న్యూ ఇయర్ వేడుకల్లో ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం..
- పబ్, రిసార్ట్స్ ఈవెంట్ మేనేజర్లకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాం..
- ఎవరైనా డ్రగ్స్ అమ్మినా.. వాడినా వారిపై చర్యలు తీవ్రంగా ఉంటాయి..
- పబ్బులపైన పూర్తిస్థాయిలో నిఘా పెట్టాం
- డ్రగ్స్ దొరికితే వారి లైసెన్స్ రద్దు చేస్తాం..
- కొన్ని ఫీల్డ్స్ వారికి డ్రగ్స్ అవసరాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం ఉంది..
- ఆయా ఫీల్డ్ వారిని కూడా హెచ్చరిస్తున్నాం.. ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ వాడవద్దు
- కొత్త సంవత్సర వేడుకలు సందర్భంగా ఆంక్షలు ఉంటాయి ..
- నగరంలో పలు బ్రిడ్జిలపై రాకపోకలు నిషేధిస్తాం …
- రాత్రి 10 గంటల నుంచి pv express wayని మూసివేస్తాం..
- ఎయిర్పోర్టుకు వెళ్లేవారికి టికెట్ చూసి అనుమతిస్తాం
- రాత్రి ఒంటిగంట వరకే వ్యాపారాలను అనుమతిస్తాం.
- ఒంటి గంట తర్వాత ఎట్టి పరిస్థితిలో వ్యాపారాలు అనుమతించబడవు..