బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్ రామిరెడ్డిని అరెస్ట్ చేయాలి: డీజీపీకి రఘునందన్ రావు ఫిర్యాదు 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్ రామిరెడ్డిని అరెస్ట్ చేయాలి: డీజీపీకి రఘునందన్ రావు ఫిర్యాదు 

BJP Leader Raghunandan Rao

Updated On : May 18, 2024 / 2:19 PM IST

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్ రామిరెడ్డిని అరెస్ట్ చేయాలని డీజీపీకి ఫిర్యాదు చేశామని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఇవాళ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ… ఫోన్ ట్యాపింగ్ కేసులో వెంకట్ రామిరెడ్డి పాత్ర ఉందని ఇప్పటికే మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చారని తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకట్ రామిరెడ్డికి సంబంధించిన 3 కోట్ల రూపాయలను తరలించినట్లు రాధాకిషన్ స్టేట్మెంట్‌లో చెప్పారని అన్నారు. వెంకట్ రామిరెడ్డిపై ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని చెప్పారు. వెంకట్ రామిరెడ్డిని ఎందుకు కాపాడుతున్నారని నిలదీశారు. ఈ విషయం చెప్పాలని డీజీపీని కోరానని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నప్పటికీ అరెస్ట్ చెయ్యడం లేదని అన్నారు. వెంకట్ రామిరెడ్డిని కులం ఒకటే అని ముఖ్యమంత్రి కాపాడుతున్నారని ఆరోపించారు. వెంటనే వెంకట్ రామిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా వెంకట్ రామిరెడ్డిని అరెస్ట్ చేయాలని అన్నారు.