రాడార్ స్టేషన్ నిర్మాణానికి రాజ్‌నాథ్‌ సింగ్ భూమి పూజ.. వికారాబాద్‌ జిల్లాలో ముందస్తు అరెస్టులు

ఏఐకేఎంఎస్‌ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు వై మహేందర్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్, పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి వై.గీతను పోలీసులు అరెస్టు చేశారు.

రాడార్ స్టేషన్ నిర్మాణానికి రాజ్‌నాథ్‌ సింగ్ భూమి పూజ.. వికారాబాద్‌ జిల్లాలో ముందస్తు అరెస్టులు

Rajnath Singh

Updated On : October 15, 2024 / 11:02 AM IST

వికారాబాద్ జిల్లాలోని దామగుండం అటవీ ప్రాంతంలో భారత నావికాదళం నిర్మించే వీఎల్​ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణానికి ఇవాళ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ భూమి పూజ చేయనున్నారు. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు.

ఈ కార్యక్రమానికి నేవీ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నం కాగా, అక్కడ ఎవరూ నిరసనలకు దిగకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే పలువురు నేతలను ముందస్తు అరెస్టులు చేశారు. ఏఐకేఎంఎస్‌ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు వై మహేందర్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్, పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి వై.గీతను పోలీసులు అరెస్టు చేశారు.

సముద్రంలేని రాష్ట్రంలో నేవీ రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుండడం ఏంటని పలు పర్యావరణ సంస్థల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వు ఫారెస్ట్‌లో రాడార్ స్టేషన్ నిర్మాణం చేపట్టవద్దని అంటున్నారు. ఆ నిర్మాణం చేపడితే జీవ వైవిధ్యంపై ప్రభావం పడుతుందని అంటున్నారు. కాగా, 2027 నాటికి ఈ రాడార్ స్టేషన్​ను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.

తెలంగాణ వ్యాప్తంగా డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సిలింగ్ వాయిదా.. ఎందుకంటే?