Special Trains : పండుగల వేళ రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం
దసరా, దీపావళి, ఛత్ పూజా పండుగల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ల (Special Trains) సేవలను పొడిగించింది.

Special Trains
Special Trains : దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దసరా, దీపావళి, ఛత్పూజా పండుగల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను అధికారులు ప్రకటించారు. మరోవైపు.. ఇప్పటికే హైదరాబాద్ – తిరుపతి మధ్య నడిచే ప్రత్యేక రైళ్ల గడువును పొడగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
దసరా, దీపావళి, ఛత్పూజా పండుగలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. ఈ పండుగల సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు నగరాల నుంచి తమ సొంత గ్రామాలకు వెళ్తుంటారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఆ రైళ్ల సేవల గడువును పెంచింది. ఈ మేరకు షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు.
ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు ఇలా ..
♦ పూరి-పాట్నా మధ్య ప్రతి శనివారం నడిచే స్పెషల్ ట్రైన్ (నం.08439)ను ఈనెల 13 నుంచి 29వ తేదీ వరకు పొడించారు.
♦ పాట్నా- పూరి మధ్య ప్రతి ఆదివారం నడిచే ట్రైన్ (నం. 08440)ను ఈనెల 14 నుంచి 29 వరకు పొడిగించారు.
♦ భువనేశ్వర్ యశ్వంత్పూర్ మధ్య ప్రతి శనివారం నడిచే రైల్ (నం. 02811)ను ఈ నెల 13 వరకు పొడగించారు.
♦ భువనేశ్వర్ – యశ్వంత్పూర్ మధ్య ప్రతి సోమవారం నడిచే రైలు (నం. 02812) ను ఈ నెల 15 నుంచి డిసెంబరు 1 పొడగించారు.
♦ విశాఖ-ఎన్ఎం వీటి మధ్య ప్రతి ఆదివారం నడిచే ట్రైన్ (నం. 08581)ను ఈనెల 4 నుంచి నవంబరు 30వరకు పొడగించగా.. ఎస్ఎంవీటి-విశాఖ మధ్య ప్రతి సోమవారం నడిచే ప్రత్యేక రైలు(సం. 08582)ను ఈ నెల 15 నుంచి డిసెంబరు 1 వరకు పొడగించారు.
♦ విశాఖ- తిరుపతి మధ్య ప్రతి బుధవారం నడిచే ప్రత్యేక రైలు (నం.08547)ను అక్టోబరు 1 నుంచి నవంబరు 26 వరకు, తిరుపతి-విశాఖపట్నం మధ్య ప్రతి గురువారం నడిచే ప్రత్యేక రైలు (నం.08548)ను అక్టోబరు 2 నుంచి నవంబరు 27 వరకు పొడగించారు.
♦ విశాఖ-చర్లపల్లి మధ్య ప్రతి శుక్రవారం నడిచే ప్రత్యేక రైలు (వం. 08579)ను అక్టోబరు 3 నుంచి నవంబరు 28 వరకు. చర్లపల్లి – విశాఖ మధ్య ప్రతి శనివారం నడిచే ప్రత్యేక రైలు (నం.08580)ను అక్టోబరు 4 నుంచి నవంబర్ 29వ తేదీ వరకు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్ – తిరుపతి ప్రత్యేక రైలు ..
♦ చర్లపల్లి -తిరుపతి మధ్య నడిచే ప్రత్యేక రైలును దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో నవంబరు 26 వరకు పొడి గిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.
♦ చర్లపల్లి-తిరుపతి మధ్య నడిచే ట్రైన్ (నం. 07013)ను నవంబరు 25 వరకు ప్రతి మంగళవారం సడపసున్నట్టు చెప్పారు. అలాగే తిరుపతి-చర్లపల్లి మధ్య నడిచే ట్రైన్(నం.07014) నవంబరు 26 వరకు ప్రతి బుధవారం ప్రయాణీకులకు సేవలు అందించనుంది.