Telangana పెరుగుతున్న Corona రికవరీ కేసులు..జిల్లాల కేసుల వివరాలు

  • Published By: madhu ,Published On : September 23, 2020 / 11:54 AM IST
Telangana పెరుగుతున్న Corona రికవరీ కేసులు..జిల్లాల కేసుల వివరాలు

Updated On : September 23, 2020 / 12:22 PM IST

Telangana Coronavirus : తెలంగాణలో కరోనా కేసులు నమోదవుతున్నా..రికవరీ కేసులు పెరుగుతున్నాయి. నిత్యం 3 నుంచి 5 వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండేవి. కానీ ప్రస్తుతం 2 వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.



తాజాగా…గత 24 గంటల్లో 2,296 కేసులు నమోదయ్యాయని, 2,062 మంది ఒక్కరోజే కోలుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,77,070 కు చేరాయి. మొత్తం



రాష్ట్రంలో ఈ వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 1,46,135 గా ఉంది. ఒక్క రోజులో 10 మంది చనిపోయారని వెల్లడించింది. కోలుకున్న వారి రేటు 82.52 శాతంగా ఉండగా, మరణాల రేటు 0.59గా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 29 వేల 073గా ఉందని, నివాసాలు / సంస్థల ఐసోలేషన్ చికిత్స పొందుతున్న వారు 23,527 గా తెలిపింది.

జిల్లాల వారీగా కేసులు :
ఆదిలాబాద్ 18. భద్రాద్రి కొత్తగూడెం 77. జీహెచ్ఎంసీ 331. జగిత్యాల 50. జనగామ 36. జయశంకర్ భూపాలపల్లి 11. జోగులాంబ గద్వాల 21. కామారెడ్డి 77. కరీంనగర్ 136. ఖమ్మం 69. కొమరం భీం ఆసిఫాబాద్ 16. మహబూబ్ నగర్ 31. మహబూబాబాద్ 72. మంచిర్యాల 37. మెదక్ 23. మేడ్చల్



మల్కాజ్ గిరి 173. ములుగు 24. నాగర్ కర్నూలు 26. నల్గొండ 155. నారాయణపేట 6. నిర్మల్ 19. నిజామాబాద్ 82. పెద్దపల్లి 40. రాజన్న సిరిసిల్ల 67. రంగారెడ్డి 217. సంగారెడ్డి 81. సిద్దిపేట 92. సూర్యాపేట 73. వికారాబాద్ 23. వనపర్తి 37. వరంగల్ రూరల్ 30. వరంగల్ అర్బన్ 99. యాదాద్రి భువనగిరి 47. మొత్తం : 2296