Raghunandan Rao : కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ తీరుపై పలు అనుమానాలు : రఘునందన్ రావు

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వైరీ చేయాలని అమిత్ షాకు లేఖ రాశారని గుర్తు చేశారు. మరి ఇప్పుడెందుకు కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు రేవంత్ లేఖ రాయట్లేదని ప్రశ్నించారు.

Raghunandan Rao : కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ తీరుపై పలు అనుమానాలు : రఘునందన్ రావు

Raghunandan Rao

Raghunandan Rao – Kaleswaram project : కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కాగ్ నివేదిక అడిగిందని, మార్చి 2023లోనే కాగ్ లేఖ పంపిందని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. అయితే తమ బండారం ఎక్కడ బయట పడుతుందోనని భయపడి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దాచి పెట్టిందని ఆరోపించారు. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు పట్ల తమకు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కాం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిందని విమర్శించారు.

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వైరీ చేయాలని అమిత్ షాకు లేఖ రాశారని గుర్తు చేశారు. మరి ఇప్పుడెందుకు కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు రేవంత్ లేఖ రాయట్లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం అంటే కేవలం మేదిగడ్డ కాదని, అది ప్రాజెక్ట్ లో చిన్న భాగం మాత్రమేనని పేర్కొన్నారు. కాళేశ్వరం పక్కన పెట్టేసి మెడిగడ్డ వరకే చర్చ సాగుతుందన్నారు. ప్రాజెక్టు కృంగినప్పుడు మేడిగడ్డ సందర్శనకు వెళ్లిన రాహూల్ గాంధీ కాళేశ్వరం సొమ్మును రికవరీ చేసి ప్రజల ఖాతాలో వేస్తామని చెప్పిన మాట ఏమైందని నిలదీశారు.

ఈ స్కాం వెనకాల మేఘ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఉందని ఆరోపించారు. ఎల్ ఆండ్ టీ వరకే కాళేశ్వరం స్కాం పరిమితం చేయాలని చూస్తున్నారని తెలిపారు. మేఘ కంపెనీకి కర్ణాటకలో కొన్ని ప్రాజెక్ట్స్ దక్కాయని వెల్లడించారు. అక్కడి ప్రభుత్వంలో ఉన్న ఓ ప్రజాప్రతినిధిని మేఘ కంపెనీ పెద్దలు కలిసినట్టు సమాచారమని తెలిపారు. దీంతో మేఘ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం కలుగుతోందన్నారు.

Also Read: కాళేశ్వరం పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. పూర్తి వివరాలు సేకరించాలని ప్రభుత్వానికి ఆదేశం

హైకోర్టు జడ్జి విచారణ అనేది కేసును పక్క దారి పట్టించడానికి మాత్రమేనని స్పష్టం చేశారు. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. మేఘ కంపెనీ అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని రేవంత్ కేంద్రాన్ని కోరాలన్నారు. దానికి సంబంధించిన ఆధారాలు కావాలంటే తాను ఇస్తానని చెప్పారు. ఇప్పటికే వారికి తాను ఆధారాలు పంపించానని, అవి వారికి చేరాయనే అనుకుంటున్నట్లు తెలిపారు.