TSPSC Instructions : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసే అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ కీలక సూచనలు
రాష్ట్రంలో 994 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పరీక్ష ప్రారంభ సమయానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది.

Group-1 Prelims Exam : తెలంగాణలో ఆదివారం(జూన్11,2023) గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష జరుగనుంది. పరీక్ష కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణలో 503 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనుంది.
రాష్ట్రంలో 994 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పరీక్ష ప్రారంభ సమయానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది. పరీక్ష కేంద్రంలోకి వాచీలు, హ్యాండ్ బ్యాగ్లు, పర్సులు అనుమతించబోరని స్పష్టం చేశారు. అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకోవాలని, షూ ధరించకూడదని చెప్పారు. నలుపు లేదా నీలం రంగు పెన్ను మాత్రమే వాడాలని సూచించారు.
AP EAPCET : జూన్ 14న ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల
జెల్, ఇంకు పెన్ను, పెన్సిళ్లను స్కానర్ గుర్తించదన్నారు. వైట్నర్, చాక్ పౌడర్, బ్లేడు, ఎరేజర్తో బబ్లింగ్ చేసే ఓఎంఆర్ షీట్ చెల్లదని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. పరీక్షలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ పరీక్ష కోసం 3,80,072 మంది దరఖాస్తు చేసుకున్నారు. 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గతేడాది ఏప్రిల్ లో నోటిఫికేషన్ జారీ చేశారు.
అక్టోబర్ 16న పరీక్ష నిర్వహించగా ఇటీవల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో గ్రూప్-1 ప్రిలిమ్స్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మళ్లీ జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పరీక్ష 3,80,032 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారందరినీ మళ్లీ పరీక్షకు అనుమంతిచనున్నారు.