Kishan Reddy : అధికారంలోకి రాగానే కేసీఆర్ సర్కార్ అవినీతిపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తాం : కిషన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీవి ఆచరణ సాధ్యం కాని హామీలని విమర్శించారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలకే దిక్కు లేదని, తెలంగాణలో ఆరు గ్యారంటీలకు దిక్కు ఉంటుందా అని అన్నారు.

Kishan Reddy : అధికారంలోకి రాగానే కేసీఆర్ సర్కార్ అవినీతిపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తాం : కిషన్ రెడ్డి

Kishan Reddy

Kishan Reddy – KCR Government : అధికారంలోకి రాగానే కేసీఆర్ సర్కార్ అవినీతిపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన అవినీతికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ అంటేనే ప్రజల నెత్తి మీద భస్మాసుర హస్తం అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తెలంగాణ ప్రజల చేతిలోకి చిప్ప వస్తోందన్నారు.

కాంగ్రెస్ పార్టీవి ఆచరణ సాధ్యం కాని హామీలని విమర్శించారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలకే దిక్కు లేదని, తెలంగాణలో ఆరు గ్యారంటీలకు దిక్కు ఉంటుందా అని అన్నారు. జీహెచ్ఎంసీ, ఉప ఎన్నికల్లో డిపాజిట్ రాని కాంగ్రెస్ కు బీజేపీని విమర్శించే హక్కు లేదని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అన్ని రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

Telangana Assembly Election 2023 : పెరుగుతున్న ఎన్నికల ప్రచార వ్యయం.. అప్పుల కోసం అభ్యర్థుల యత్నం

ఫీజులపై నియంత్రణ తీసుకొస్తాం‌మని చెప్పారు. విద్య, వైద్య రంగాన్ని తీర్చి దిద్దుతామని తెలిపారు. రైతుబంధును కొనసాగిస్తామని వెల్లడించారు. వరి పంటకు కనీస మద్దతు ధర రూ.3,100 ఇస్తామని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్ల కంటే ఎక్కువ అవసరం ఉండదన్నారు. అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్ళ‌ పట్టాలు ఇస్తామని చెప్పారు.

దేశవాళీ ఆవులను రైతులకు ఇస్తామని హామీ ఇచ్చారు. 4శాతం మతపరమైన రిజర్వేషన్లను ఎత్తేసి హైకోర్టు తీర్పును అమలు చేస్తామని చెప్పారు. రైతులు సహా అన్ని వర్గాల నుంచి బీజేపీ మ్యానిఫెస్టోకు మంచి స్పందన వస్తోందన్నారు. బీసీ, ఎస్సీలు బీజేపీ వెంట పూర్తిస్థాయిలో నడవబోతున్నారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం మేధావులు, కవులు, కళాకారులు అలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. రానున్న వారం రోజుల్లో ప్రధాని మోదీ ఆరు సభల్లో‌ పాల్గొంటారని తెలిపారు.