చినరాజప్పకు షాక్: గ్రామంలోకి రావద్దు అంటూ నిరసనలు
ఎన్నికల వేళ అధికార తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత, ఉపముఖ్యమంత్రి చినరాజప్పకు గట్టి షాక్ తగిలింది. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం అసెంబ్లీకి టీడీపీ తరుపున పోటీ చేస్తున్న చినరాజప్ప ఎన్నికల ప్రచారంను హుస్సేన్ పురం గ్రామస్థులు అడ్డుకున్నారు. సామర్లకోట మండలం హుస్సెన్ పురం గ్రామంలో నిమ్మకాయల చినరాజప్పను ప్రచారానికి రావద్దు అంటూ గ్రామస్తులు నిరసన తెలుపారు. రాజప్ప.. డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. స్థానికులు ఆందోళన చేయడంతో చినరాజప్ప ప్రచారం నుంచి వెనుదిరిగారు, అయితే ఎందుకు ఆందోళన చేశారు అనే విషయంపై క్లారిటీ రాలేదు.
East Godavari district: Andhra Pradesh Deputy Chief Minister & Peddapuram MLA N Chinarajappa had to return without campaigning from Hussein Puram village in his assembly constituency yesterday due to protests by the locals pic.twitter.com/DFzMSg3eHN
— ANI (@ANI) April 1, 2019