రేణిగుంటలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం: టీసీ, ప్రయాణీకులపై దాడి

చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్ లో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. ప్రయాణికులపై దాడికి పాల్పడింది. అడ్డుకునేందుకు యత్నించిన టీసీ ఉమామహేశ్వరరావుపైనా నిందితులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో టీసీ సహా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారినిక ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. నిందితులను తమిళనాడుకు చెందిన వెంకటేశ్, విజయన్ లుగా పోలీసులు గుర్తించారు. వారిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా ఏపీలో విజయవాడ, రాజమండ్రి, కర్నూలు వంటి పలు ప్రాంతాలలో బ్లేడ్ చేసిన ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఒంటరిగా..రాత్రి సమయంలో ప్రయాణించేవారిపై దాడులకు పాల్పడి దోచుకునేవారు. ఈ క్రమంలో కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా రైల్వే స్టేషన్ లో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టారు.