నవంబర్ 1 నుంచి అమలు : రిజిస్ట్రేషన్ శాఖలో సీఎం జగన్ సంచలన సంస్కరణలు

స్టాంప్స్ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖలో ప్రక్షాళనకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. రిజిస్ట్రేషన్ శాఖలో సంచలన సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఇకపై క్రయ, వియక్రయదారులే స్వయంగా

  • Published By: veegamteam ,Published On : October 13, 2019 / 02:22 PM IST
నవంబర్ 1 నుంచి అమలు : రిజిస్ట్రేషన్ శాఖలో సీఎం జగన్ సంచలన సంస్కరణలు

Updated On : October 13, 2019 / 2:22 PM IST

స్టాంప్స్ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖలో ప్రక్షాళనకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. రిజిస్ట్రేషన్ శాఖలో సంచలన సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఇకపై క్రయ, వియక్రయదారులే స్వయంగా

అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిన స్టాంప్స్ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖలో ప్రక్షాళనకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. రిజిస్ట్రేషన్ శాఖలో సంచలన సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఇకపై క్రయ, వియక్రయదారులే స్వయంగా తన డాక్యుమెంట్ ను తానే తయారు చేసుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్‌ రుసుమును కూడా ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు వీలు కల్పిస్తున్నారు. కొనుగోలుదారులు, విక్రయదారులు తమ పనుల కోసం రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల దగ్గర పడిగాపులు కాసే పరిస్థితికి పూర్తి స్థాయిలో స్వస్తి చెబుతున్నారు. ఆన్‌లైన్‌ లో తమకు సంబంధించి క్రయ, విక్రయాలపై సొంతంగా డాక్యుమెంట్‌ను తయారు చేసుకోవడంతో పాటు దాన్ని రిజిస్ట్రేషన్ల శాఖకు అప్‌లోడ్‌ చేయడం ద్వారా టైం స్లాట్‌ను కూడా పొందే అవకాశం కల్పిస్తున్నారు.  రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న కొత్త విధానాలతో రిజిస్ట్రేషన్ల శాఖలో మరింత పారదర్శకత వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. 

రాష్ట్రంలో ఇళ్లు, భవనాలు, వ్యవసాయ భూములు, నివాస స్థలాలకు సంబంధించి సేల్‌ డీడ్‌, సేల్‌ అగ్రిమెంట్‌, తాకట్టు రిజిస్ట్రేషన్‌, బహుమతి రిజిస్ట్రేషన్లు, జీపీఏ తదితర కార్యకలాపాలకు అనుగుణంగా నమూనా డాక్యుమెంట్లను స్టాంప్స్ అండ్‌ రిజిస్ట్రేషన్స్ శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. వివిధ అవసరాలకు తగినట్లు 16 నమూనా డాక్యుమెంట్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ డాక్యుమెంట్‌లలో క్రయ, విక్రయదారులు తమ వివరాలను నింపి వాటిని అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ వ్యవహారం గతంలో డాక్యుమెంట్‌ రైటర్లు చేసేవారు. ఇప్పుడు వారితో అవసరం లేకుండానే క్రయ, విక్రయదారులే నేరుగా చేసుకునే వీలు కల్పించారు. 

తెలుగు, ఇంగ్లీష్‌ లో నమూనాలను ఉపయోగించుకోవచ్చు. నమూనా పత్రంలో ఉన్న వివరాలు కాకుండా అదనపు అంశాలు ఉన్నా కూడా దీనిలో నమోదు చేసుకునే అవకాశం ఉంది. సిద్దం చేసుకున్న మొత్తం డాక్యుమెంట్‌ను ప్రింట్‌ తీసుకోవాలి. దానితో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్తే.. సదరు డాక్యుమెంట్‌ను స్కాన్ చేసి, అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు. ఇప్పటికే విశాఖపట్నం, కృష్ణా జిల్లాలో ఎంపిక చేసిన సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ ప్రక్రియను ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఈ ప్రక్రియ అమలులో ఇబ్బందులను తెలుసుకునేందుకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఇందులోని పలు లోపాలను అధికారులు గుర్తించి, వాటిని సవరించారు. నవంబర్‌ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియను అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయబోతున్నారు.

నూతన విధానం ద్వారా సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సమర్పించే డాక్యుమెంట్లను ఏదైనా కారణం వల్ల తిరస్కరిస్తే దానిపై అప్పీల్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. ఇందుకోసం రిజిస్ట్రేషన్‌ చట్టం 73, 74 కింద జిల్లా రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చ. ఏ కారణాల వల్ల డాక్యుమెంట్‌ను తిరస్కరించారో సదరు అధికారి నిర్ణీత సమయంలో పూర్తి వివరణ ఇస్తారు. ఈ చర్యలతో రిజిస్ట్రేషన్లలో పారదర్శకత మరింత పెరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు.